సాధారణంగా మనం గుళ్లలో శివలింగాల చుట్టూ నాగుపాములు ప్రదక్షిణలు చేయడం, శివలింగానికి చుట్టుకుని ఉండటం లాంటి అద్భుతాలను మనం చూసే ఉన్నాం. కానీ కొన్ని కొన్ని అద్భుతాలను మాత్రం మనం చూసే దాక అంత ఈజీగా నమ్మలేం. భారతీయ సనాతన సంప్రదాయంలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి అద్భుత సంఘటనే మన తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకుంది. శివాలయంలో అర్దరాత్రి వేళ ఆలయంలో వెండి నేత్రాలు ప్రత్యక్షం అయ్యాయి. దాంతో భక్తులు తండోపతండాలుగా చూడటానికి వస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని బూదవాడ గ్రామంలో శ్రీభ్రమరాంబ సహిత నాగలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ గుడికి ప్రాచీనకాలం నాటి చరిత్ర ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హుస్సేన్ అనే యువకుడికి గత 14 రోజులుగా దేవుని కళ్లు దేవాలయంలో ఉన్నట్లు కలలు వస్తున్నాయంట. ఆ కళ్లు గుడిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వెనుక ఈ వెండి త్రినేత్రాలు ఉన్నట్లు కనిపించినట్లు హుస్సేన్ చెప్పాడట. ఇక ఇదే విషయాన్ని గుడిలో నిద్రిస్తున్న అయ్యప్ప స్వాములకు చెప్పాడు. అదీకాక నీటితో శివుడికి అభిషేకం చేసి వెండి నేత్రాలు ఇక్కడే ఉన్నయి అంటూ ఓ ప్రాంతాన్ని చూపించాడు.
దాంతో వారు ఆ ప్రాంతంలో తవ్వి చూడగా అక్కడ మూడు వెండి నేత్రాలు దర్శనం ఇచ్చాయి. దాంతో ఇదంతా ఆ శివుడి లీలే అని అక్కడి వారందరు భావిస్తున్నారు. ఆ నేత్రాలను శివాలయంలోనే పెట్టి పూజలు చేస్తున్నారు. ఈ త్రినేత్రాలను చూడటానికి చుట్టు పక్కల ప్రజలందరు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంపై కొందరు చరిత్రకారులు మాట్లాడుతూ.. ఇది ప్రాచీన కాలం నాటి గుడి కావడంతో ఇక్కడ అలాంటి విలువైన బంగారం, వెండి లాంటి విలువైన విగ్రాలు, నగలు లభించడం సాధారణమే అని చెప్పుకొచ్చారు.