భారత దేశంలో ఎన్నో గొప్ప గొప్ప దర్శనీయ స్థలాలు.. దేవాలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో షిరిడీ ఒకటి. షిర్డీ సాయిబాబా దర్శనం కోసం ప్రతిరోజూ లక్షల మంది యాత్రికులు వస్తుంటారు. బాబాని దర్శనం చేసుకొని ప్రార్ధనలు చేస్తుంటారు. సాయి బాబా తన బోధనలతో హిందూ.. ముస్లిం సాంప్రదాయాలను పాటించారు. సాయిబాబా అల్లా మాలిక్.. సబ్ కా మాలిక్ ఏక్ హై అంటారు.. అందరికి దేవుడు ఒక్కడే అని ఆయన ప్రజలకు భోదించేవారు. ఆయన బోధనలలో ప్రేమ, కరుణ, శాంతి, దైవారాధన, గురు పూజ ముఖ్యమైన అంశాలు. సాయి బాబాను భారతీయులు భగవంతుడిగా పూజిస్తుంటారు.
ఒక్కసారైనా షిరిడీని దర్శించుకోవాలని చాలా మంది అనుకుంటారు. సాయినాథుని ఒక్కసారి దర్శించుకున్నా జన్మధన్యం అనుకునే భక్తులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి కి సాయి సంస్థాన్ ఒక గొప్ప శుభవార్త తెలిపింది. సాధారణంగా సాయిబాబ దర్శనం కోసం షిరిడే వేళ్లే భక్తులకు ఆయన సమాధిని స్పృశించే అవకాశం ఉండదు. కేవలం ఇది వీవీఐపీలకు మాత్రమే ఉంటుంది. ఇక నుంచి సాధారణ భక్తులకు సైతం ఈ సువర్ణ అవకాశం కల్పించేందుకు సాయి సంస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ భాగ్యశ్రీ వనాయత్ తెలిపారు.
వాస్తవానికి ఒకప్పుడు షిరిడీ సాయిబాబా సమాధిని స్పృశించే అవకాశం అందరికీ ఉండేది.. కానీ కొంత కాలంగా భక్తుల తాకిడి ఎక్కువ కావంతో సాయి బాబా సమాధి వద్ద ఒక గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టారు అక్కడి సిబ్బంది. దీంతో అప్పటి నుంచి సామాన్య భక్తులకు సాయిబాబా సమాధిని తాకే అవకాశం లేకుండా పోయింది. కేవలం వీఐపీలు వచ్చినపుడు లోపలికి తీసుకు వెల్లి సాయినాథుని సమాది స్పృశించే విధంగా ఏర్పాట్లు చేసేవారు. తాజాగా సాయి సంస్థాన్ తీసుకున్న నిర్ణయంతో సాయినాథుని భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి సాయిబాబా సమాధిని తాకే అవకాశం వల్ల షిరిడీ కి భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు