సాయిబాబా తమ ఊరిలోనే జన్మించారని పత్రి వాసులు అంటున్నారు. అందుకు సంబంధించి 29 ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, 29 కాదు కదా పత్రి వాసులు సరైన ఆధారం ఒక్కటి చూపించాలని షిర్డీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సాయిబాబా పత్రిలో 1838లో జన్మించారు. మాజీ ముఖ్యమంత్రి బాలాసాహెబ్ ఖేర్ కుమారుడు విశ్వాస్ ఖేర్ 30 ఏళ్ల పాటు పరిశోధన చేసి సాయిబాబా జన్మస్థలం పత్రి అని చెప్పారు’’ అని పత్రిలోని సాయిబాబా జన్మస్థల మందిర్ ట్రస్టు అధ్యక్షుడు అటుల్ చౌధరీ వివరించారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి నాందేడ్కు రైలులో వెళ్తుంటే మధ్యలో మన్వత్ రోడ్ అనే స్టేషన్ వస్తుంది. అక్కడ అనేక ఏళ్లుగా ఒక బోర్డు కనిపిస్తోంది. “సాయిబాబా జన్మస్థలాన్ని దర్శించుకునేందుకు ఇక్కడ దిగండి” అని దానిపై రాసి ఉంటుంది. కానీ, అది బాబా జన్మస్థలమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. పత్రి వాసులతో పాటు, ఇక్కడ నివసించే ఇతర ప్రజలు మాత్రం సాయిబాబా జన్మస్థలం పత్రినే అని నమ్ముతారు. “
సాయిబాబా తమ ఊరిలోనే జన్మించారంటూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని చోట్ల వాదనలు ఉన్నాయి. సాయిబాబా పట్ల ప్రజలకు ఉన్న భక్తి భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, కానీ వాళ్లు చేస్తున్న వాదనలకు ఎలాంటి ఆధారాలూ లేవు” అని ఆయన వ్యాఖ్యానించారు. “ఆ కాలంలో ‘దీనబంధు’ అనే మరాఠీ పత్రిక సత్యశోధక్ సమాజ్కు చెందిన ఉద్యమకారుడు ముకుందరావు పాటిల్ ఆ పత్రికకు ఎడిటర్గా పనిచేశారు. కానీ, ఆయన సాయిబాబా గురించి ఒక్కసారి మాత్రమే పేర్కొన్నారు.
అప్పట్లో వెలువడిన మరో పత్రిక కేసరి కూడా సాయిబాబా గురించి ఏ విషయాలూ రాయలేదు. పత్రి గ్రామంలో పెద్దలు మాత్రం బాలగంగాధర్ తిలక్తో పాటు సీనియర్ నాయకులు కూడా సాయిబాబాను కలిసేందుకు తమ ఊరికి వచ్చినట్లు చెబుతారు. కానీ, అందుకు సంబంధించి ఎలాంటి ఆధారమూ లేదు. ఒకసారి మెజిస్ట్రేట్ ముందు సాయిబాబాను విచారించారు. ఆయన తన జన్మస్థలం గురించి ఏమీ చెప్పలేదు. తన పేరు సాయిబాబా అని చెప్పారు” అని ఆయన వివరించారు.
సాయిబాబా జన్మస్థలంపై ఎలాంటి వివాదాలు అవసరం లేదు. సాయిబాబా అందరికీ చెందుతారు. ఆయన అన్ని చోట్లా ఉన్నారు. కాబట్టి, ఈ వివాదాన్ని అంతగా పెంచకూడదు అని భక్తుల భావం.