నేటి తరం యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తూ దారుణాలకు తెగ బడుతున్నారు. ఒప్పుకుందా సరే.. లేదంటే ఆ యువతుల ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటం, హత్యలు చేయటంతో వంటి ఘటనలు రోజు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా శ్రీనగర్ కాలనీకి చెందిన గంజి దిలీప్ కుమార్ అనే యువకుడు హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
అదే కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అమ్మాయిపై అతనితో సన్నిహితంగా మెలిగింది. ఇదే అదునుగా భావించిన దిలీప్ కుమార్ ఆ యువతిని ప్రేమ పేరుతో వేధించటం మొదలు పెట్టాడు. ఆ యువకుడి ప్రేమను యువతి నిరాకరించింది. దీంతో రోజు దిలీప్ ఆగడాలకు భరించలేని యువతి ఆ కంపెనీలో ఉద్యోగం మానేసింది. ఏం చేయాలో తెలియని దిలీప్ ఆ యువతిపై పగ పెంచుకున్నాడు. దీంతో పథకం ప్రకారం ఆ యువతి ఇన్స్ట్రాగామ్ ఐడీని హ్యాక్ చేసి ఫోటోలను వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులతో నెట్ లో అప్ లోడ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిచింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.