Red Bus: రెడ్ బస్లో ప్రయాణం చేస్తున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. బస్ సిబ్బంది ఒకరు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె ఆవేదనకు గురయ్యారు. తన బాధను ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన శృతి అనే యువతి బెంగళూరులో పనిచేస్తోంది. జులై 7వ తేదీన బెంగళూరునుంచి చెన్నైకి బయలుదేరింది. ఇందుకోసం రెడ్ బస్లో టికెట్ బుక్ చేసుకుంది.
వీహెచ్బీ ట్రావెల్స్ బస్లో చెన్నైకి ప్రయాణం అయ్యింది. ఆమె తన సీటులో నిద్రపోతుండగా 3 గంటల సమయంలో బస్ సిబ్బంది ఒకరు ఆమెను అసభ్యంగా తాకాడు. ఆమెకు మెలుకువ వచ్చి చూసింది. తన సీటు కింద ఉన్న సీటులో ఓ వ్యక్తి పడుకుని ఉన్నాడు. నువ్విక్కడ ఏం చేస్తున్నావని శృతి అతడ్ని అడిగింది. అప్పుడు అతను ‘నా చేతులు నా దగ్గరే ఉన్నాయి. అని సమాధానం ఇచ్చాడు. దీంతో ఆమెకు విషయం అర్థం అయ్యింది. శృతి అతడితో గొడవపెట్టుకుంది.
ఓ గంట పాటు బస్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు కలుగజేసుకున్నారు. బస్ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. 4.20 గంటల సమయంలో ఆమె రెడ్ బస్లో దీనిపై ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆమె భావించింది. రోజులు గడిచాయి. శృతి తన ఫిర్యాదుపై రెడ్ బస్ను సంప్రదించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగింది. అయితే, దీనిపై రెడ్ బస్నుంచి ఆమెకు ఊహించని సమాధానం వచ్చింది.
గతంలో ఆ బస్పై ఫిర్యాదులు ఏవీ నమోదుకానందున ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. దీంతో ఆవేదనకు గురైన శృతి తన బాధను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అప్పుడు రెడ్ బస్నుంచి ఓ రిప్లై వచ్చింది. ఆమె తన సోషల్ మీడియా పోస్టులు డిలీట్ చేస్తే.. బస్ టిక్కెట్ డబ్బులు వెనక్కు ఇస్తామని వారు చెప్పారు. ఈ రిప్లైకి శృతి ఓ నవ్వు ఎమోజీతో సమాధానం ఇచ్చి ఊరుకుంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య