ఆశలు తీర్చుకునేందుకు చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారు. చెల్లి, వదిన, కూతురు, అత్త.. ఇలా వావివరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. అడ్డొచ్చిన వాళ్లను సైతం కాటికి పంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి బంధాల్లో వేలు పెడుతున్న కొంత మంది నిండు సంసారాన్ని చేజేతుల్లా నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ అల్లుడు సొంత అత్తపై కన్నేశాడు. దీనికి తోడు అత్త కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు హద్దులు దాటేశారు. ఓ రోజు అత్తా, అల్లుడు స్థానికులకు అడ్డంగా దొరికిపోయారు. ఇక వారు ఆగ్రహంతో వారిపై దాడి చేయడంతో అత్త మరణించగా, అల్లుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముర్షిదాబాద్ జిల్లా. నర్సీబాబీబీ, మోపీజుల్ మోండోల్ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి గత కొంతకాలం కిందట వివాహమైంది. అయితే అత్త తరుచూ కూతురు వద్దకు వస్తుండడంతో అల్లుడు ఏకంగా అత్తపై మనసు పడ్డాడు. దీనికి అత్త కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరూ హద్దులు చెరిపేసుకున్నారు. దీంతో సమయం దొరికినప్పుడల్లా ఏకాంతంగా కలుస్తున్నారు.
ఇది కూాడా చదవండి: పెళ్లై నెలరోజులు.. ప్రియుడిని మర్చిపోలేకపోయింది..
అయితే ఈ క్రమంలోనే ఇటీవల అత్త ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి అల్లుడు ఇంట్లోకి దూరిపోయాడు. దీనిని గమనించిన కొందరు స్థానికులు అతగాడు వెళ్లిన కొద్దిసేపటికి మెల్లగా వాళ్లున్న ఇంటి తలుపు తట్టారు. ఇక తలుపు తీసేదే ఆలస్యం కర్రలతో ఇద్దరిపై దారుణంగా దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా వెంటనే మరి కొందరు స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అత్త ప్రాణాలు కోల్పోగా, అల్లుడు చికిత్స పొందుతున్నాడు. ఇక అనంతరం అల్లుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.