మరణం.. కొందరి జీవితాల్లో తీరని శోకాన్ని మిగిల్చితే.. మరికొందరు జీవితాల్లో మాత్రం పూడ్చలేని విషాదాన్ని మిగిల్చుతుంది. నా అనుకున్న వాళ్ల మరణాన్ని తట్టుకోలేని కొందరు బతికినా చావుతోనే సమానమనే విధంగా ఉంటుంటారు. చివరికి వారి మరణ వార్తను జీర్ణించుకోలేక అక్కడికక్కడే కుప్పకూలిపోతుంటారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ఇల్లాలు భర్త మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే తన ప్రాణాలు విడిచింది. తాజాగా విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని సాలూరు పట్టణం. ఇదే ప్రాంతంలో చిన్న(72), విజయమ్మ (68) అనే దంపతులు నివాసం ఉండేవారు. అయితే ఈ దంపతులు ప్రాణంగా కన్నంగా ఎక్కువగా కలిసుండేవారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా జీవించేవారు. ఇలా ఎంతో అన్యన్యమైన జీవితాన్ని గడుపుతున్న వీరి జీవితంలోకి ఒక్కసారిగా విషాదం తరుముకుంటు వచ్చింది.
ఇది కూడా చదవండి: Hyderabad: నైట్ షిఫ్ట్ లో నరకం చూపిస్తున్నారు! వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య!
విజయమ్మ భర్త చిన్న గత కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో విజయమ్మ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ తనకు అన్ని పనులు చేసేది. కాగా చివరికి అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున చిన్న మరణించాడు. దీంతో భర్త మరణాన్ని తట్టుకోలేక పోయిన భార్య విజయమ్మ తీవ్ర మనస్థాపానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు విజయమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక చికిత్స పొందిన విజయమ్మ ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం రాత్రి మరణించింది. ఒక రోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మరణించడంతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇటీల చోటు చేసుకున్న ఈ ఘటన గ్రామస్తులకు కన్నీరుని తెప్పిస్తుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.