నేటి కాలంలోని యువతి, యువకులు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడడం, చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భీమిలి మండలం కొత్త మూలకుద్దు పాకదిబ్బ గ్రామం.
కొయ్య లావణ్య(16) అనే బాలిక స్థానికంగా ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతు తల్లిదండ్రుల వద్దే నివాసం ఉంటుంది. అయితే ఇదే ప్రాంతానికి చెందిన మణి కుమార్ అనే యువకుడితో లావణ్యకు పరిచయం పెరిగింది. వీరిద్దరి పరిచయం కాస్త కొన్నాళ్లకి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు. ఇక కొంత కాలం వీరు సినిమాలు, షికారులు అంటూ తిరుగుతు తెగ ఎంజాయ్ చేశారు.
ఇది కూడా చదవండి: Bengaluru: నాలుగు నెలల కిందట ప్రేమ పెళ్లి! ఎవరూ లేని సమయంలో నవ వధువు షాకింగ్ డెసిషన్!
దీంతో ఎలాగైన మణి కుమార్ నే వివాహం చేసుకోవాలని లావణ్య బలంగా అనుకుంది. ఇదే విషయమై లావణ్య ప్రియుడికి చెప్పింది. ప్రియుడు మణి కుమార్ మాత్రం లావణ్యతో పెళ్లికి నిరాకరించాడని తెలుస్తోంది. ఇదే కాకుండా వీరిద్దరి ప్రేమ విషయంతో పాటు పెళ్లి చేయాలంటూ వీరిద్దరి తల్లిదండ్రులకు తెలపడంతో పెళ్లికి వారు కూడా నిరాకరించారని సమాచారం. అయితే వీటన్నిటి కారణాలతో లావణ్య తీవ్ర మనస్థాపానికి గురైంది. ప్రేమించిన ప్రియుడే నాతో పెళ్లికి నిరాకరించాడనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక పరీక్షలు జరిపిన వైద్యులు అప్పటికే లావణ్య మరణించిందని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే లావణ్య మరణంపై ఎక్కడ కూడా క్లారిటీ లేదనే వాదన వినిపిస్తుండడం విశేషం. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.