భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. కష్టాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ సంసారాన్ని ఈడ్చుకొస్తుంటారు. అలా ఓ భర్త కష్టాల్లో ఉన్నప్పుడు తోడునీడగా ఉండాల్సిన ఓ భార్య మాత్రం.. అతడిని వదిలేసి కనిపించకుండాపోయింది. తాజాగా వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగింది? భార్య భర్తను వదిలి వెళ్లడానికి అసలు కారణం ఏమైన ఉందా? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీధర్ ప్రసాద్, రిజ్వనా ఇద్దరు భార్యాభర్తలు. వీరు గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలం పాటు ఇద్దరూ హైదరాబాద్ కాపురం పెట్టారు. అలా కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. ఇదిలా ఉంటే ఉన్నట్టుండి శ్రీధర్ తల్లి ఆరోగ్యం అంతగా బాగులేదని ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో భర్త శ్రీధర్ భార్యను తీసుకుని హుటాహుటిన తన సొంత ఊరు అయిన వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు వెళ్లాడు. ఇక అక్కడికి చేరుకున్నాక శ్రీధర్ తల్లి ఆరోగ్యం విషమించడంతో వెంటనే ఓ ఆస్పత్రిలో చేర్పించాడు. శ్రీధర్ ఆస్పత్రిలో తల్లిని చూసుకుంటూ ఉన్నాడు.
అయితే ఈ క్రమంలోనే శ్రీధర్ భార్య రిజ్వానా ఉన్నట్టుండి సోమవారం.. నీ చావు నువ్వు చావు అంటూ భర్తకు మెసేజ్ చేసి అక్కడి కనిపించకుండాపోయింది. దీంతో వెంటనే స్పందించిన భర్త చుట్టు పక్కల ప్రాంతాల్లో అంతటా వెతికాడు. ఎంత వెతికినా భార్య రిజ్వానా జాడ మాత్రం దొరకలేదు. చివరికి భర్త శ్రీధర్ కు ఏం చేయాలో అర్థం కాక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆపధలో ఉన్న భర్తకు తోడుగా ఉండాల్సిన రిజ్వానా ఇలా చేయడం ఏంటన బంధువులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.