ఆదివారం గుంటూరులో తెలుగు దేశ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకల పేరుతో ఓ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. టీడీపీ నేత ఉయ్యూరు శ్రీనివాస్ సంక్రాంతి కానుకల పేరుతో ప్రజలను ఈ సభకు అహ్వానించారు. దీంతో చాలా మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలతో పాటు చాలా మంది ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ సభ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా, చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు మరణించిన వారిని పోస్ట్ మార్టం ఆస్పత్రికి తరలించగా, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
అయితే వెంటనే మృతుల కుటుంబ సభ్యులు సభ నిర్వహించిన ఉయ్యూరు శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతని కారణంగా మా కుటుంబ సభ్యులు చనిపోయారని ఫిర్యాదులో తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు సభ నిర్వహించిన ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ అతడు కనిపించకుండపోవడంతో పోలీసులు బృందాలుగా విడిపోయి అతని ఆచూకి కోసం గాలించారు.
భాగంగా తాజాగా విజయవాడ ఏలూరు లాడ్జిలో ఉయ్యూరు శ్రీనివాస్ ఉండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 8 మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకోవడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వరుస తొక్కిసలాట ఘటనలపై అధికార పార్టీ నేతలు చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఈ రెండు ఘటనలకు చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఘటన ఏపీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏపీలో జరగుతున్న వరుస తొక్కిసలాట ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.