నేటి కాలంలో చదువు చెప్పే కొందరు మాస్టారులు దారులు మరిచి ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు. పాఠాలు చెప్పాల్సింది పోయి తమకు నచ్చిన బాలిలకు ప్రేమ పాఠాలు చెబుతూ వారిని వలలో వేసుకుంటున్నారు. ఇంతటితో ఆగకుండా చేయాల్సినవి అన్నీ చేసేస్తూ చివరికి అసలు విషయాలు బయటపడడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని రసల్పూర్ గ్రామంలో వీరేంద్ర (40) అనే వ్యక్తి లెక్కల మాస్టారుగా పని చేస్తున్నాడు.
కొంత కాలం పాటు బాగానే చదువు చెప్పాడు. అలా చదువు చెబుతున్న క్రమంలోనే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చే పనికి శ్రీకారం చుట్టాడు. ఆ ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో చదువుకుంటున్న 9వ తరగతి బాలికపై కన్నేశాడు. ఏకంగా క్లాస్ రూంలోనే ఆ బాలికకు ప్రేమ పాఠాలు చెప్పి మరింత దగ్గరయ్యాడు. అలా కొంత కాలం వీరి వ్యవహారం నడుస్తూ వచ్చింది. ఆ మాస్టారు ఆ బాలికతో శారీరకంగా కలుసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 3 నుంచి వీరిద్దరూ కనిపించకుండ పోయారు.
దీంతో ఆందోళనకు గురైన ఇరువురి కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఓ చోట వీరిద్దరూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అసలు వీరు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? లేక ఎవరైన హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.