వారికి కొత్తగా పెళ్లైంది. వీరి పెళ్లికి బంధువులు అంతా వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక పెళ్లి అనంతరం వధువు కుటుంబ సభ్యులు నూతన వధూవరులకు శోభనం ఏర్పాటు చేశారు. దీంతో వరుడు, వధువు ఇద్దరూ బెడ్ రూంలోకి వెళ్లారు. అయితే శోభనం రెండవ రోజు వధువు వరుడికి ఊహించని షాకిచ్చింది. దీనిని తట్టుకోలేకపోయిన వరుడు నెత్తినోరు బాదుకుని అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వరుడికి వధువు ఇచ్చిన షాక్ ఏంటి? అసలు శోభనం గదిలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉత్తర్ ప్రదేశ్ ఈటా పరిధిలోని జైతారా గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ యువకుడి పెళ్లికి అతని బంధువులు, మిత్రులు అందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక పెళ్లి అనంతరం వధువు కుటుంబ సభ్యులు నూతన వధూవరులకు శోభనం ఏర్పాటు చేశారు. ఇక మొదటి రాత్రిలో భాగంగా వరుడు వధువుతో శారీరకంగా కలిసే ప్రయత్నం చేశాడు. కానీ దీనికి మొదటి రోజు వధువు నిరాకరించింది. దీంతో వరుడు వెంటనే.. పెళ్లిలో అలసిపోయి ఉంటుందని అనుకున్నాడు. ఇక మరుసటి రోజు కూడా వధువు అతనితో శారీరకంగా కలిసేందుకు నిరాకరించింది. దీంతో అనుమానం వచ్చిన వరుడు ఏం జరిగిందంటూ గట్టిగా నిలదీశాడు.
దీంతో భయంతో వణికిపోయిన ఆ వధువు.. నేను ఓ ట్రాన్స్ జెండర్ అని, నా తల్లిదండ్రులు నాకు బలవంతంగా పెళ్లి చేశారని అసలు గుట్టు విప్పింది. ఆ మాటలు విన్న వరుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. నెత్తి, నోరు బాదుకుని చేసేదేం లేక 5 రోజుల తర్వాత వధువుని తన పుట్టింటికి పంపించాడు. అనంతరం వధువు పుట్టింటివాళ్లు వచ్చి వరుడికి ఇచ్చిన కట్నం, అభరణాలు తీసుకెళ్లారు. దీంతో వరుడు వెంటనే ఈ పెళ్లికి అయిన ఖర్చును నాకు చెల్లించాలని కోరాడు. దీనికి నిరాకరించిన వధువు కుటుంబ సభ్యులు వరుడికిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఈ ఘటనపై వరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.