పెళ్లి కార్డు ఇస్తానని యువకుడు తల్లిదండ్రులను నమ్మించి యువతి ఇంట్లోకి వెళ్లాడు. నిజమేనని భావించిన యువతి తల్లిదండ్రులు సరేనంటూ వెళ్లమని చెప్పారు. దీంతో పరుగు పరుగున వెళ్లిన ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి గొంతు కోసి తనను తాను కడుపులో పొడుచుకున్నాడు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్లోని మథుర పరిధిలోని నాగ్లా బోహ్రా ప్రాంతంలో ఓ యువకుడికి, ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సోనమ్ అనే యువతికి మధ్య గత కొంత కాలంగా ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.
ఇక ఇద్దరు కొన్ని రోజులు మాట్లాడుకున్నట్లు సమాచారం. కొంత కాలం బాగానే ఉన్న వీరిద్దరు ఏం జరిగిందో తెలియదు ఈ మధ్యకాలంలో వీరి మధ్య విభేదాలు వచ్చాయి. అయితే ఈ యువతి ఫేస్ బుక్ లో అతనిని అన్ ఫోలో చేసి పూర్తిగా మాట్లాడడమే మానేసింది. దీంతో ఆ యువకుడికి కోపం కట్టలు తెంచుకుంది. సోనమ్ తో మాట్లాడేందుకు ఆ యువకుడు అనేక సార్లు నచ్చజెప్పాడు. ఎంతకు కూడా ఆ యువతి అతనితో మాట్లాడేందుకు ఇష్ట పడలేదు. దీంతో ఆ యువకుడు కోపంతో రగిలిపోయి ఆమె మీద పగ పెంచుకున్నాడు.
ఇది కూడా చదవండి: Bhadradri Kothagudem: పదేళ్ల కిందట ప్రేమ వివాహం! పూజారి వద్ద శిష్యరికం చేస్తూ చివరికి!
అయితే గత ఆదివారం సాయంత్రం ఆ యువకుడు సోనమ్ ఇంటికి చేరుకుని మీ అమ్మాయికి పెళ్లి కార్డు ఇవ్వాలని చెప్పాడు. దీంతో ఆ యువతి తల్లిదండ్రలు సరేనంటూ తలుపులు తీశారు. వెంటనే సోనమ్ వద్దకు వెళ్లిన ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో సోనమ్ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను కూడా అదే కత్తితో కడుపులో పొడుచుకున్నాడు. దీంతో వెంటనే స్పందించిన యువతి తల్లిదండ్రులు యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ యువతి మరణించినట్లుగా వైద్యులు నిర్దారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.