ఉత్తర్ ప్రదేశ్ లో కొందరు హిజ్రాలు బరితెగించి ప్రవర్తించారు. అర్థరాత్రి ఓ యువకుడిని అడ్డగించి నమ్మించి అతడితో మాటలు కలిపారు. ఆ తర్వాత అతనిని మెల్ల మెల్లగా మాటల్లోకి దింపిన ఆ హిజ్రాలు మత్తు కలిపిన బిస్కెట్లు తినమని ఇచ్చారు. వారిచ్చిన బిస్కెట్లు తిన్న ఆ యువకుడు కొద్దిసేపటి తర్వాత మత్తులోకి జారుకున్నాడు. ఇదే మంచి సమయం అనుకున్న ఆ హిజ్రాలు ఆ యువకుడిని స్థానికంగా ఉన్న ఓ శ్మశానానికి తీసుకెళ్లి ఆ తర్వాత అతడి మర్మాంగాన్ని కోశారు. అనంతరం ఆ హిజ్రాలు ఆ యువకుడిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం… ఉత్తర్ ప్రదేశ్ బదౌన్ జిల్లాలోని సరాయ్ గ్రామంలో మీరా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఈ నెల 4న ఆ యువకుడు పక్కఊళ్లో ఓ పార్టీకి హాజరై తిరిగి వస్తున్నాడు. ఇదే క్రమంలో ఇద్దరు హిజ్రాలు అతనికి ఎదురుగా వచ్చారు. అతడి రాకను గమనించిన ఆ హిజ్రాలు అతడిని అడ్డగించి అతనితో కాసేపు మాట్లాడారు. మెల్ల మెల్లగా అతడిని మాటల్లోకి దించి తమ వద్ద ఉన్న మత్తు కలిపిన బిస్కెట్లు అతడికి తినమని ఇచ్చారు. దీంతో ఆ యువకుడు ఏం ఆలోచించుకుండా వారిచ్చిన బిస్కెట్లు తిన్నాడు. ఇక తిన్న కొద్దిసేపటి తర్వాత అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్నాడు. ఇదే మంచి సమయం అనుకున్న ఆ హిజ్రాలు ఆ యువకుడిని స్థానికంగా ఉన్న శ్మశానికి తీసుకెళ్లారు.
అనంతరం పదునైన ఆయుధంతో ఆ యువకుడి మర్మాంగాన్ని కోసి అక్కడి నుంచి ఆ హిజ్రాలు పరారయ్యారు. దీంతో మత్తులో నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు విలవిలలాడిపోయాడు. దీంతో కదలలేని స్థితిలో ఉన్న ఆ యువకుడు గత నాలుగు రోజుల నుంచి అదే శ్మశానంలోనే ఉండిపోయాడు. ఆ యువకుడిని గమనించిన కొందరు స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులు హిజ్రాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడున్నారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హిజ్రాల దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.