Crime News: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ భార్యాభర్తల జంట ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. భార్యాభర్తలు అడవిలోకి వెళ్లి ఒకే చెట్టుకు, ఒకేసారి ఉరివేసుకున్నారు. అయితే, భర్త ఉరికి వేలాడి చనిపోగా.. భార్య మాత్రం బతికి పోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, ఆగ్రా జిల్లాలోని గిలోయ్కి చెందిన కిసాన్ మన్ సింగ్ ఓ చిన్నకారు రైతు. ఉన్న ఎకరం పొలంతో భార్య, నలుగురు పిల్లల్ని పెంచి పోషించాడు. నలుగురికి పెళ్లిళ్లు కూడా చేశాడు. అయితే, గతకొన్ని రోజులుగా ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇబ్బందులు పడుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే మన్ సింగ్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇందుకు భార్యను కూడా ఒప్పించాడు. ఇద్దరూ ఊరికి కొంత దూరంలో ఉన్న అడవికి వెళ్లారు. అక్కడ ఉన్న ఓ వేప చెట్టుకు ఉరి బిగించుకున్నారు. దాన్ని గొంతుకు బిగించుకుని కిందకు దూకారు. మన్ సింగ్ ఊపిరి ఆడక చనిపోయాడు. కానీ, అతడి భార్య బరువు తట్టుకోలేక ఉరి తాడు తెగిపోయింది. ఆమె చెట్టుపై నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయినప్పటికి ఆమె పైకి లేచి అక్కడినుంచి ఊరి వైపు పరుగులు తీసింది.
ఊరి బయట ఓ ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆమెను చూశారు. గొంతుకున్న తాడు తీసి విషయం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. చెట్టు వద్దకు వెళ్లి మన్ సింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భార్య ప్రైవేట్ పార్ట్ లో ఫెవిక్విక్ పెట్టి రాక్షసానందం పొందిన భర్త! తర్వాత జరిగింది ఇదే!