ఉదయం లేచిన దగ్గర నుండి కొంచెం సమయం దొరికితే చాలు మొబైల్స్ వాడుతున్నారు నేటి యువత. ఇంటర్ నెట్ వినియోగం అధికమైనప్పటీ నుండి స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. ముఖ్యంగా పబ్జి ఆటలలో మునిగిపోయి తిండి తినడం, నిద్రపోవడం వంటి విషయాల్ని కూడా మర్చిపోయి, జీవితంలో ఎంతో ముఖ్యం అయినా చదువును కూడా నిర్లక్ష్యం చేసింది యువత.
చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా పబ్ జి గేమ్ కి బానిసలు అవుతున్నారు. పబ్ జీ గేమ్ ఆడవొద్దని పిల్లలకు తల్లిదండ్రులు ఎంతగా ఆంక్షలు పెట్టినా వినిపించుకోకపోవడం పైగా కొంత మంది మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఆన్ లైన్ గేమ్ ఆడవొద్దని చెప్పినందుకు తల్లిని హత్యచేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ కు రూ.1,000 కోట్ల ఆఫర్ ప్రకటించిన KA పాల్!
సాధన అనే మహిళ భర్త ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆమె తన కుమారుడు, కూతురు తో కలిసి లక్నోలో జీవిస్తుంది. అందరు పిల్లల మాదిరిగానే తన పిల్లలు కూడా మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశపడుతూ వచ్చింది సాధన. భర్త ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుంటే.. తాను పిల్లల చదువు విషయంలో ఎంతో శ్రద్ద చూపించేది. కానీ సాధన కుమారుడు మాత్రం పబ్ జీ గేమ్ కి బానిస అయ్యాడు. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ఎప్పుడూ సెల్ ఫోన్ తో ఆడుకుంటూనే ఉండేవాడు.
సెల్ ఫోన్ లో పబ్ జీ గేమ్ ఆడవొద్దని తల్లి ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ కుర్రాడు మాత్రం ససేమిరా అనేవాడు. ఒకరోజు కొడుకు మొబైల్ లో గేమ్స్ ఆడటాన్ని గమనించిన సాధన సీరియస్ గా కుమారుడికి వార్నింగ్ ఇచ్చింది. తనని గేమ్ ఆడకుండా ప్రతిసారి అడ్డు పడుతుందని ఆమె కుమారుడు కోపంతో ఊగిపోయాడు. తన తండ్రి పిస్టల్ తీసుకుని తల్లి తలపై కాల్చేశాడు. దాంతో సాధన అక్కడే ప్రాణాలు విడిచింది.
ఈ ఘటన తర్వాత తన సోదరిని వేరొక గదిలో ఉంచి బయట గడియపెట్టాడు. ఆ తర్వాత మూడు రోజుల పాటు తల్లి శవాన్ని ఇంట్లోనే దాచాడు. దుర్వాసన రాకుండా ఉండాలని గదుల్లో రోజూ రూమ్ ఫ్రెష్నర్లను స్ప్రే చేశాడు. తమ అమ్మమ్మకు ఆరోగ్యం బాలేదని, అందుకే తన తల్లి వారి దగ్గరకు వెళ్లిందని పొరుగువారికి చెప్పి నమ్మించాడు. మంగళవారం సాయంత్రం తన తండ్రికి కాల్ చేసి విషయాన్ని తెలిపాడు.
బాలుడి తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సాధన ఇంటికి చేరుకొని బాలుడిని విచారిస్తే.. ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి తన తల్లిని కాల్చి చంపినట్టు వారికి కట్టుకథ వినిపించాడు. రెండున్నర గంటల విచారణ తర్వాత అతడు అసలు విషయాన్ని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ‘అంటే సుందరానికి’ ప్రీరిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్..!
UP | A minor boy shot dead his mother after she stopped him from playing PUBG game. Preliminary probe revealed that he was addicted to the game and his mother used to stop him from playing, due to which he committed the incident with his father’s pistol: ADCP, East Lucknow (07.6) pic.twitter.com/t1gA1nG5k4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 7, 2022