శ్రీవారి హుండీ లెక్కింపులో భాగంగా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి విదేశీ డాలర్ పై కన్నేశాడు. ఎవరూ చూడడం లేదనుకుని ఆ విదేశీ డబ్బును దొంగిలించాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటుంటారు. అయితే భక్తులు దేవుడి దర్శన అనంతరం తమ స్థోమత, స్థాయిని బట్టి కానుకలు సమర్పిస్తుంటారు. అలా రోజుకి శ్రీవారి హుండీలో ఎంతో మంది భక్తులు కానుకలు హుండీలో వేస్తుంటారు. అలా వచ్చిన ఆ నగదును కొంతమంది ఉద్యోగుల చేత లెక్కిస్తుంటారు. అలా హుండీలోని నగదు లెక్కింపు ప్రక్రియకు అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేస్తారు. కానీ, తాజాగా శ్రీవారి హుండీ లెక్కింపులో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఏపీలో కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తిరుమలకు వస్తుంటారు. ఇక ఆ దేవుడిని దర్శించుకున్న తర్వాత అందరూ తమకు తోచిన నగదును శ్రీవారి హుండీలో వేస్తుంటారు. భక్తులు రోజూ అలా వేసే నగదు ఏకంగా కోట్లకు పైనే ఉంటుందట. అయితే ఈ డబ్బును లెక్కించడానికి అధికారులు పకడ్భంది ఏర్పాటు చేసి ఉద్యోగులతో లెక్కిస్తారు. ఇదిలా ఉంటే.. శ్రీవారి హుండీ నగదు లెక్కింపులో పనికి కుదిరిన ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఇటీవల చేతి వాటం ప్రదర్శించాడు. హుండీలో ఉన్న విదేశీ డాలర్లపై కన్నేశాడు. ఎలాగైన దొంగిలించాలని ప్లాన్ వేసి తాను అనుకుననట్లుగా ఆ పని ముగించేశాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిని విజిలెన్స్ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విదేశీ డాలర్ దొంగిలించిన ఆ కాంట్రాక్ట్ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ఉద్యోగులు, అధికారులు అంతా షాక్ గురయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విదేశీ డాలర్ ని దొంగిలించిన ఉద్యోగి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.