ప్రమాదాలు ఎప్పుడు ఎలా ముంచుకొస్తాయో ఎవరూ ఊహించలేం.. అప్పటి వరకు మనతో సంతోషంగా ఉన్నవారు ప్రమాదంలో చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం. పెళ్లి వేడుకలో బంధుమిత్రుల హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ పెళ్లి భారాత్ కోసం అందరూ సంతోషంగా తయారవుతున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు సజీవ దహనం కాగా.. సుమారు 50 మంది వరకు గాయాలపాలయ్యారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
జోధ్పూర్ భూంగ్రా గ్రామంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుంది. అందరూ ఆనందంగా పెళ్లి హడావుడిలో ఉన్నారు.. ఇక ఇంట్లోంచి బారాత్ గా వెళ్లాల్సి ఉండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి.. దాంతో టెంట్ కి మంటలు అంటుకోవడంతో దాని కింద ఉన్న ముగ్గురు చిన్నారులు.. ఇద్దరు మహిళలు అక్కడే సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో 50 మంది గాయపడ్డారు.. వారిని వెంటనే జోద్ పూర్ లోని మహాత్మాగాంధీ హాస్పిటల్ కి తరలించారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నదని.. ఓ చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిపాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ హీమన్షు గుప్త అక్కడికి చేరుకొని పరిస్థితి పరిశీలించి వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. పేలుడు ధాటికి భవనంలోని ఓ భాగం కుప్పకూలిపోయిందని.. దీన్ని బట్టి పేలుడు ఎంత తీవ్రస్థాయిలో జరిగిందో తెలుస్తుందని అధికారులు అంటున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిచారు.
Jodhpur, Rajasthan | Around 60 people injured after a house caught fire during a wedding in Bhungra village
It’s a very serious accident. 42 people out of the 60 injured were referred to MGH hospital. Treatment is going on: Himanshu Gupta, District Collector (08.12) pic.twitter.com/9DYKOeHFrE
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 9, 2022