ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే తపస్సు చేయాల్సిందే అంటారు. ఎంతో కష్టపడితే కానీ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించలేమన్న విషయం తెలిసిందే. అలాంటిది తన భార్యకు ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో అని భయపడ్డ ఓ దుర్మార్గపు భర్త ఆమె చేయిని నరికివేశాడు. ఈ దారుణమైన ఘటన ఘటన పశ్చమ బెంగాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
పశ్చిమ బెంగాల్ కి చెందిన మహమ్మద్- రేణు ఖాతున్ భార్యాభర్తలు కొంత కాలంగా అన్యోన్యంగానే ఉన్నారు. రేణు ఖాతున్ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుతూ వచ్చింది. తాను ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉండేది. అందుకోసం దుర్గాపూర్లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో నర్సింగ్లో శిక్షణ పొందింది. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ‘అంటే సుందరానికి’ ప్రీరిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్..!
తన చిరకాల స్వప్నం అయిన గవర్నమెంట్ ఉద్యోగం రావడంతో ఆమె సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. కానీ, ఆమె భర్త షేర్ మహమ్మద్ కి మాత్రం తన భార్య రేణు ఖాతున్ ఉద్యోగం చేయడం అస్సలు ఇష్టం లేదు. దీంతో ఆమెను ఉద్యోగానికి వెళ్లవొద్దని శాసించాడు. ఈ క్రమంలో ఇద్దరి మద్య పెద్ద గొడవ జరిగింది.. అయినప్పటికీ ఆమె ఉద్యోగం చేసేందుకే మొగ్గు చూపింది. తన మాట లెక్కచేయడం లేదని ఆక్రోశంతో ఆమె కుడి చేయిని నరికేశాడు. వెంటనే అక్కడ నుంచి పారిపోయాడు.
రేణు గట్టిగా అరిచిన అరుపులు విని చుట్టుపక్కల అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో ఉన్న రేణు ఖాతున్ ని ఆసుపత్రిలో చేర్పించారు. రేణు కుడి చేతిని తొలగించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే భార్యపై దాడి చేసి పారిపోయిన ఆమె మహమ్మద్ గురించి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.