ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో కలిగే మధుర భావన. ఆ బంధానికి కులం, మతం, ఆస్తి, అంతస్థులు అడ్డుకాలేవు. ప్రేమ ఎప్పుడు, ఎవరికి, ఎలా, ఎందుకు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అలా ప్రేమ పుడుతుందంతే. గతంలో అంటే ప్రేమ, పెళ్లి అనగానే.. పెద్దలు పరువు అంటూ అడ్డు చెప్పేవారు. కానీ, రోజులు మారాయి. పెద్దలు కూడా పిల్లల భవిష్యత్ బావుంటే చాలు అని పెళ్లిళ్లు చేస్తున్నారు. దేశంలో ఇంకా ఏదొక మూల పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ పరువు హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రేమికులను ఇంట్లోంచి లాక్కొచ్చి తూటాల వర్షం కురిపించారు. వద్దన్నా ప్రేమించిందంటూ ప్రాణం తీశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లా జలాలాబాద్ పీఎస్ పరిధి కకరాహ్ గ్రామంలో ఈ అమానవీయ ఘటన వెలుగు చూసింది. సోనూ అనే యువకుడు పక్కింట్లో ఉండే ప్రీతి అనే యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రాణంగా ప్రేమించింది. ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసిపోయింది. ప్రేమ వద్దంటూ వారించారు. కానీ, వాళ్లు పెద్దల మాట వినలేదు. తమ మాట కాదని ఆ యువకుడిని ప్రేమిస్తోందని కూతురిపై తండ్రి కక్ష పెంచుకున్నాడు. తమ మాట లెక్కచేయని కూతురిని.. ప్రేమించిన ఆ యువకుడు ఇద్దరినీ చంపేయాలని నిర్ణయించుకున్నారు.
ఆ యువతికి నలుగురు సోదరులు ఉన్నారు. తండ్రి, ఆ సోదరులు అంతా కలిసి ఆ యువతిని కడతేర్చాలని అనుకున్నారు. మంగళవారం సాయంత్రం సోనూ.. ప్రీతి వాళ్ల ఇంటింకి వచ్చాడు. ఆ సమయంలో ఆమె సోదరులు రాజీవ్, సుశీల్, ములాయం, నర్సింగ్ వాళ్లిదరినీ ఇంట్లోంచి లాక్కొచ్చారు. రోడ్డుపై నిలబెట్టి.. అక్కడ ఏం జరుగుతుందో తెలిసేలోపే తూటాల వర్షం కురిపించారు. ఆ పాపంలో యువతి తండ్రి కూడా పాలు పంచుకున్నాడు. యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఓ తూటా యువకుడి పొట్టలో దిగింది. వారి కోపం చల్లారక ఇటుక రాయితో సోనూ తలపై దాడి చేశారు. ఇద్దరూ మరణించారని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
ఇదీ చదవండి: భర్తతో పనేంటి.. ప్రియుడు ఉండగా? బరి తెగించిన భార్య!
ఈ పరువు హత్య స్థానికంగా కలకలం రేపింది. రోడ్డుపై అలా ఇద్దరినీ కాల్చి చంపడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఆ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కన్న కూతురి కంటే తనకు పరువు ఎక్కువ అనుకున్న ఈ తండ్రిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.