ఆమో అందగత్తె.. తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి దందా షురూ చేసింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి పక్కాగా ప్లాన్ చేసింది. రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్లు, రాజకీయ నేతలను లైన్ లో పెట్టింది. చనువు పెంచుకుని.. ఇంటికి రండి ఎవరూ లేరంటూ ఆఫర్లు ఇచ్చింది. మీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. మీరు ఏది అడిగా అడ్డు చెప్పను.. ఈ రాత్రంతా జాగారమే అంటూ రెచ్చ గొట్టింది. ఆమె కైపెక్కించే మాటల వెనుకున్న కుట్ర పసిగట్టలేని కొందరు రాజకీయ నేతలు.. కిలేడీ వలపు వలలో చిక్కుకుని విలవిల్లాడారు. అక్రమంగా కూడబెట్టిన లక్షల్ని పంచుకునే విషయంలో మొదలైన వివాదం అసలు విషయాన్ని బయటపెట్టింది.
ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లా సూరమంగళంలో కళైసెల్వి అలియాస్ సెల్వి నివాసముంటోంది. డబ్బు సంపాదించాలనేది ఆమె కోరిక. సరైన వ్యూహం ఉంటే చాలా ఈజీగా డబ్బు సంపాదించవచ్చని నమ్మింది. అనుకున్నదే తడవుగా బాయఫ్రెండ్ సెల్వాతో కలిసి పక్కగా ప్రణాళిక రచించింది. చూడగానే ఆకట్టుకునే రూపం, సన్నగా ఎత్తుగా ఉండే ఆహార్యం, కవ్వించే చూపులు, కపైక్కించే మాటలు.. ఇవే ఆ కిలేడీ పెట్టుబడి. తిరుచ్చి జిల్లాలోని పలుకుబడి ఉన్న జిల్లా స్థాయి రాజకీయ నాయకుల లిస్టు రెడీ చేశారు. ఆరుగురు నాయకులను ఫైనల్ చేశారు. వారి పేర్లు, నంబర్లు, వివరాలు అన్నీ ఒక పెద్ద చిట్టా సిద్ధం చేశారు.
వేరే వ్యక్తికి ఫోన్ చేయబోయి పొరపాటున మీకు చేశాను అంటూ మాటలు కలిపింది. ప్లాన్ ప్రకారం ఒక్కొక్కరితో పరిచయం పెంచుకోవడం మొదలు పెట్టింది. నెమ్మదిగా చనువు పెంచుకోవడం.. వీలైనంత ఎక్కువసేపు మాటలతో మాయలోకి దించడం చేసింది. చిన్నగా ఫొటోలు పంపుతూ ఎలా ఉన్నాను అంటూ ఎర వేస్తూ వచ్చింది. చిన్నగా డోస్ పెంచి.. హస్కీ వాయిస్ తో పిచ్చెక్కించడం మొదలు పెట్టింది. ఆమె మాటలు, చేష్టలకు వారు రెడ్ క్లాత్ చూసిన బుల్ ల రెచ్చిపోయారు.
ఏదొక పార్టీ ఉంది మీరు మా ఇంటికి రావాలి అంటుంది. ఎవరెవరు వస్తున్నారు అనగానే.. ‘మీరొస్తుండగా ఇంకొకర్ని ఎందుకు పిలుస్తాను? మీరంటే నాకు ఎంత స్పెషలో మీకు తెలీదా? ఇంట్లో ఎవరూ లేరనే ఈ ప్రైవేట్ పార్టీ ప్లాన్ చేశాను. మీరు తప్పకుండా రావాలి అంటూ ట్రాప్ చేసింది. అంతటితో ఆగితే వస్తారో రారో అని.. వస్తే మీకు ఏది కావాలన్నా ఇస్తాను. మీరు ఏది అడిగినా ఎదురు చెప్పను- నో అనను. మీరు వస్తే ఈ రాత్రిని మీరు జీవితంలో మర్చిపోలేకుండా చేస్తాను. మీరు వస్తారని ఆశిస్తూ.. తలుపులు తెరిచే ఉంచి ఎదురుచూస్తుంటాను’ అంటూ రెచ్చగొట్టింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
మొత్తం ఆరుగురికి గాలం వేస్తే.. ముగ్గురు ఆమె ఉచ్చులో చిక్కుకున్నారు. ఏ రోజు ఎవరు వచ్చేది ముందే తన ప్రియుడికి వివరాలు ఇచ్చేది. వాళ్లు వచ్చే టైమ్ అన్నీ అప్ డేట్ చేసేది. వాళ్లు వచ్చిన కాసేపటికి సెల్వం ఎంట్రీ ఇచ్చేవాడు. వారు పడక గదిలో సరసాలు మొదలు పెట్టగానే ప్రియుడు కెమెరాతో రికార్డింగ్ చేసేవాడు. HD క్వాలిటీతో దృశ్యాలను తీశాక.. వాటిని ఎడిటింగ్ చేసి టీజర్లు, ట్రైలర్లతో ఆ నేతలకు బెదిరింపులు పంపేవారు. ఇన్ని లక్షలు ఈ టైమ్ కి ఈ ప్లేస్ లో కావాలి. ‘లేదంటే నీ రంకు పురాణం నీ భార్య, నీ పార్టీ హైకమాండ్ కు చేరుతుంది’ అని బెదిరించేవారు.
అయితే ఇంటి దొంగే ఈ కిలేడీని పట్టిస్తాడని ఆమె ఊహించలేదు. సెల్వి-సెల్వం-రూపక్ ఒక ముఠాగా ఈ హనీ ట్రాప్ చేసేవారు. అయితే బెదిరింపులతో వచ్చిన లక్షలు పంచుకునే విషయంలో వీరి మధ్య విభేదాలు వచ్చాయి. కిలేడీ, ఆమె ప్రియుడు కలిసి తనకు ముష్టి వేస్తున్నారని రూపక్ భావించాడు. ఎలాగైనా వీళ్లకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కళైసెల్విని కిడ్నాప్ చేసి ఆమె ఎలా వల వేసింది- ఎలా వీడియోలు తీసింది.. ఆమెతోనే చెప్పించాడు. ఆ వీడియో పోలీసులకు అప్పగించాడు. అయితే మొదట మోసపోయిన ముగ్గురిలో ఏ ఒక్కరు ముందుక రాలేదు. ఆ తర్వాత ఓ మాస్ లీడర్ నాగేంద్రన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు ఆవిధంగా వీరి హనీ ట్రాప్ వెలుగులోకి వచ్చింది. కిలేడీ కళైసెల్వి, ఆమె ప్రియుడు సెల్వాను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.