ఇప్పుడిప్పుడే సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు పెరుగుతున్నాయి. తాము ఇష్టపడిన వ్యక్తినే మనువాడతామంటూ అమ్మాయిలు సైతం తెగేసి చెబుతున్నారు. అందుకు తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ, కొన్ని జంటలకు అది అంత ఈజీ కాదు. అన్ని ప్రేమలు పెళ్లిపీటలు ఎక్కలేవు అని చాలా సందర్భాల్లో చూశాం. ఈ జంట కూడా ఆ కోవకు చెందిందే. పైగా వీళ్లు బావామరదళ్లు కూడా.. కానీ వారి పెళ్లికి మాత్రం పెద్దలు ఒప్పుకోలేదు. అందుకని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన తమిళనాడులోని విలుప్పురంలో జరిగింది. రాజేశ్- లోకేశ్వరి అనే బావామరదళ్లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్నారు. వరసకు బావామరదళ్లు కావడంతో అదే విషయాన్ని పెద్దలకు చెప్పారు. కానీ, ఆ పెద్దలు వీరి వివాహానికి ఒప్పుకోలేదు. వేరొకరిని వివాహం చేసుకోవడానికి ఇద్దరూ సుముఖంగా లేరు. ఇద్దరూ కలిసి బెంగళూరు వెళ్లి అక్కడే కొన్నాళ్లు ఉండాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఇద్దరూ కలిసి బెంగళూరులో కొన్నాళ్లు ఉన్నారు.
మరి వారి నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారో తెలీదు. బెంగళూరు నుంచి సాలెం వెళ్లే ప్రభుత్వ సర్వీసు బస్సు ఎక్కారు. క్షణికావేశంతో ఓ నిర్ణయం తీసుకున్నారు. కలిసి జీవించలేని మనం.. కలిసి తనువు చాలిద్దామనే నిర్ణయానికి వచ్చారు. రన్నింగ్ బస్సులోనే వారితో తెచ్చుకున్న విషాన్ని తాగేశారు. కాసేపు వారిద్దరినీ చూసిన బస్సులోని మిగతా ప్రయాణికులకు ఏం అర్థం కాలేదు. వెంటనే రాజేశ్- లోకేశ్వరిలను ఆస్పత్రికి తరలించారు. సకాలంలో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలు కాపాడగలిగారు. ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ప్రేమకు ఒప్పుకోకపోతే చావు ఒక్కటే పరిష్కారమా? రాజేశ్- లేకేశ్వరి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.