దాంపత్య జీవితంలో ఇంతక ముందు రోజంతా అన్యోన్యంగా ఉంటే.. ఏదొక క్షణంలో మాత్రమే విభేదాలు వచ్చేవి. కానీ, ప్రస్తుతం రోజుంతా గొడవ పడితే ఒక్క క్షణం నవ్వితే చాలు అనేలా తయారైంది చాలా మంది పరిస్థితి. దానికి తోడు అనుమానం అనే పెనుభూతం తోడైతే ఏం జరుగుతుందో మీరే ఊహించండి. అవును, అదే జరిగింది. అనుమానంతో ఓ భర్త తన భార్యను, అత్తను బోండాల కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లికి చెందిన రవికుమార్ భార్య సావిత్రి, అత్త సరోజమ్మలతో కలిసి మూడలపాళ్యలో నివాసముంటున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బతుకుతెరువు కోసం 20 ఏళ్ల క్రితమే బెంగళూరుకు వలస వచ్చారు. రవికుమార్ కు భార్య సావిత్రిపై అనుమానం ఉంది. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అనే భావనలో ఉన్నాడు. ఆ విషయంలో ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. అంతేకాదు.. భార్య మీద అనుమానంతో చాలాసార్లు ఇల్లు కూడా మార్చాడు. ఆ విషయంలోనే వారిద్దరికూ ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి.
మంగళవారం ఉదయం పిల్లలను స్కూలుకు పంపిన తర్వాత రవికుమార్ భార్యతో మరోసారి గొడవకు దిగాడు. భార్య, అత్తపై కోపంతో ఊగిపోయాడు. క్షణికావేశంలో బోండాలు కొట్టే కత్తితో అత్త, భార్యలను నరికి చంపేశాడు. ఆ తర్వాత బైక్ వేసుకుని గోవిందరాజనగర పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్విహించారు. కేసు నమోదు చేసి రవికుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భర్తతో పనేంటి.. ప్రియుడు ఉండగా? బరి తెగించిన భార్య!