అత్యంత దారుణమైన ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి.. హత్య చేసిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఓ ఆర్మీ జవాను ఇలా చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఒంగోలు ఎస్పీ మలికా గార్గ్ వివరాల ప్రకారం.. ఈ ఘటనకు పాల్పింది ఆర్మీ జవాను దోసపాటి వెంకట ప్రశాంత్(21). అతనికి అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉంది. వాటికి బానిసగా మారాడు. అశ్లీల వీడియోలు చూసి అమ్మాయిలతో చాటింగ్ చేస్తుంటాడు. సెలవుల మీద ఇంటికి వచ్చినప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అశ్లీల వీడియోలు చూసి బయటకు వచ్చిన ప్రశాంత్ కు బాధిత బాలుడు ఆటుకుంటూ కనిపించాడు. అతనికి వంద రూపాయలు ఇచ్చి కూల్ డ్రింక్స్ తెమ్మని పంపాడు. ఆ తర్వాత బాలుడుని బైక్ పై ఎక్కించుకుని కత్తులవారిపల్లి, ఇడకమల్లు క్రాస్ రోడ్డు వద్దకు తీసుకెళ్లాడు.
ఆ ప్రాంతంలో బాలుడిపై అసహజమైన లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఆ బాలుడు కేకలు వేయడంతో గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత బాలుడి మృతదేహానికి రాయి కట్టి బావిలో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. ఊరు- పేరులేని ఓ సిమ్ కార్డు తీసుకుని బాలుడి పెదనాన్నకు ఫోన్ చేశాడు. బాలుడిని హతమార్చిన విషయం చెప్పి రూ.50 లక్షలు ఇవ్వకపోతే కుటుంబంలోని మిగిలిన వారిని కూడా హత్య చేస్తానంటూ బెదిరించాడు. వారు పోలీసులను ఆశ్రయించారు. మొదటి నుంచి ప్రశాంత్ పై అనుమానం ఉన్న పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. పక్కా ఆధారాలతో ప్రశాంత్ ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.