సాంకేతికంగా మనిషి ఎంత అభివృద్ధి చెందాడో చూస్తూనే ఉన్నాం. ఇంట్లో కూర్చొని విశ్వమంతటా ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నాడు. అంగారకుడిపై కూడా ఇల్లు కట్టే స్థాయికి మన టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఆడపిల్లలు కూడా అంతరిక్షాన్ని చుట్టేస్తున్నారు. ఇంకా మగపిల్లాడు కావాలంటూ ఓ తల్లి పడిన ఆరాటం.. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యానికి గూర చేస్తోంది. కొన్ని విషయాల్లో మనిషి ఎంత మూర్ఖంగా, గుడ్డిగా వ్యవహరిస్తాడో ఈ విషయం తెలియజేస్తుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ దేశం పెషావర్ లో నివశిస్తున్న ఒక గర్భిణి మగ పిల్లాడి కోసం కలలు కంటోంది. ఆమెకు మొదట మూడు కాన్పుల్లో ఆడపిల్లలే పుట్టారు. ఈసారి ఎలాగైనా అబ్బాయే పుట్టాలని గట్టిగా కోరుకుంది. కానీ, ఎక్కడో ఓ మూల అనుమానం ఉంది. మళ్లీ అమ్మాయే పుడితే? అందుకే ఆమె ఓ భూత వైద్యుడిని సంప్రదించింది. తనకు ఎలాగైనా మగపిల్లాడు పుట్టేలా చూడలని వేడుకుంది. అందుకు భూత వైద్యుడు ఓ మార్గం ఉందన్నాడు. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ, అది కాస్త కష్టతరమైన మార్గం అని ఆ భూతవైద్యుడు తెలిపాడు. మగపిల్లాడి కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తానంటూ ఆమె చెప్పింది.
మగపిల్లాడు పుట్టాలంటే తలలో మేకు దింపుకోవాలని అతను తెలిపాడు. మొదట కాస్త కంగారు పడిన ఆ గర్భిణి మగపిల్లాడు పుట్టడం కోసం అందుకు అంగీకరించింది. ఆ భూత వైద్యుడు సుత్తి తీసుకుని ఓ మేకును ఆమె తలలో దించాడు. కాస్త కొట్టగానే ఆ నొప్పి భరించలేకపోయింది. తల నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆమె నొప్ప తాళలేక కేకలు వేయడంతో ఆ మేకును తీసేందుకు భూత వైద్యుడు ప్రయత్నించాడు. కానీ, ఆ మేకు ఇరుక్కు పోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు.
ఇదీ చదవండి: మరో గంటలో వివాహం.. అంతలోనే మృత్యువు ఒడిలోకి!
వెంటనే ఆ గర్భిణీని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేసి ఆ మేకును తీసేశారు. ఆమె అదృష్టం ఏంటంటే ఆ మేకు మెదడుకు తాకలేదు. కుటుంబ సభ్యులు జరిగిందంతా వైద్యులతో చెప్పడంతో అసలు కథ బయటకు వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆ భూత వైద్యుడి కోసం గాలింపు చేపట్టారు. అమ్మానాన్నను చూసుకోవడానికి ఆడపిల్ల సరిపోదా? పున్నామ నరకం నుంచి కాపాడేందుకు కొడుకే కావాలా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.