కామంతో కళ్లు మూసుకుపోయి అలా చేస్తున్నారో? జీవితం, కాపురం కంటే తుచ్యమైన పడక సుఖమే ఎక్కువనుకుని అలా చేస్తున్నారో అంతుపట్టని విషయం. ఎంతో మంది తమ కాపురాలను నాశనం చేసుకున్నారు.. చేసుకుంటూనే ఉన్నారు. ఆ జాబితా అప్రతిహితంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ లిస్టులోకి మరో మహిళ చేరింది. పత్తి చేను పరిచయాన్ని కాస్తా పక్క దాకా తీసుకెళ్లింది. కట్టుకున్న వాడు కసురుకున్నాడని.. ఉంచుకున్నవాడితో కలిసి కడ తేర్చింది. చేసిన పాపం ఊరికే పోతుందా.. ఇప్పుడు ప్రియుడితో కలిసి కటకటాల పాలైంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ దారుణ ఘటన మరెక్కడో కాదు నల్గొండ జిల్లా నీలగిరి మున్సిపాలిటీ పరిధి పానగల్ లో జరిగింది. ఇరగదిండ్ల వెంకన్న(40), సుజాత పానగల్ లో నివాసముంటున్నారు. వెంకన్న బోరుబావుల తవ్వకం పనులు చేస్తుండేవాడు. సుజాత పత్తి కూలీలకు మేస్త్రీగా పని చేసేది. అలా పత్తి చేనుకు కూలీలను తీసుకెళ్లే క్రమంలో ఆమెకు లింగస్వామి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కూతురు, కొడుకుండి.. ఆ వయసులోనూ కట్టుకున్న భర్త కళ్లుగప్పి పత్తి చేను పరిచయాన్ని పక్క దాకా తీసుకెళ్లింది. ఏమనుకున్నారో.. ఏమో ఇద్దరూ ఆ వయుసులో లేచిపోయారు. విషయం తెలిసి వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ వెంకన్నకు తన భార్యను అప్పగించారు.
కుక్క తోక వంకర.. అలవాటు పడ్డ ప్రాణం.. ఇలాంటి మాటలు వినే ఉంటారు కదా. అలాంటివి సదరు సుజాతకు యాప్ట్ గా ఉంటాయి. మళ్లీ షరా మామూలే.. లింగస్వామితో పరిచయాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఓ రోజు సిటీకి వెళ్లి వస్తూ వెంకన్న పూటుగా తాగొచ్చాడు. ఒళ్లు తెలీకుండా మంచంపై పడుకుని నిద్రపోతున్నాడు. అదే అదునుగా భావించిన సుజాత.. ప్రియుడికి కాల్ చేసి రప్పించింది. నిద్రమత్తులో ఉన్న వెంకన్న ముఖాన సుజాత- లింగస్వామి కలిసి దిండు వేసి నొక్కి.. గొంతు నులిమి హత్య చేశారు. ఏమీ తెలీనట్లు లింగస్వామి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
ఇది కూడా చదవండి: ‘ఆ కామ పిశాచిని ఉరి తీయండి’
ఆ తర్వాత సుజాత డ్రామా మొదలు పెట్టింది. పోలీసులకు తానే ఫోన్ చేసి తన భర్త మద్యం మత్తులో కింద పడి చనిపోయాడని చెప్పింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ సమయంలో అసలు విషయాన్ని మృతుడి తండ్రి పోలీసులకు వివరించాడు. వారికి సుజాతపైనే అనుమానం ఉందని చెప్పారు. గతంలో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో చెక్కేసిన విషయాన్ని చెప్పారు. అంతా విన్న పోలీసులకు కూడా అనుమానం బలపడింది. విచారణ చేయగా.. సుజాత హత్య చేసిన విషయాన్ని ఒప్పుకుంది. విచారణలో ఇంకా షాకింగ్ విషయాలు తెలిశాయి. వెంకన్నను హత్య చేయాలని ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వీళ్లు హత్యకు కుట్ర పన్ని విఫలమయ్యారు. ఓ రోజు వెంకన్నను.. కారుతో గుద్ది హత్య చేయాలని లింగస్వామి ప్రయత్నించినా కుదర్లేదు. ఆ తర్వాత భార్య భోజనంలో నిద్రమాత్రలు కలిపింది. కానీ అప్పుడు కూడా వెంకన్నకు ఏం కాలేదు. ఇలా కాదని ఈసారి నిద్రపోతున్నప్పుడు తాము అనుకున్నది చేశారు.
ఇక్కడ తప్పు ఎవరిది అని ఆలోచించే కంటే శిక్ష ఎవరికి పడింది అనేది ఆలోచించాలి. లేచిపోయిన భార్యను నమ్మి వెంకన్న శిక్ష అనుభవించాడు. ప్రియుడి మోజులో భర్తను చంపిన సుజాతకు శిక్ష పడుతుంది. పడక సుఖం కోసం కక్కుర్తి పడిన లింగస్వామికి శిక్ష తప్పదు. కానీ, ఏ తప్పు చేయని వాళ్ల పిల్లలకు కూడా శిక్ష పడుతుంది. తండ్రిలేక, తల్లి జైలులో ఉండి వాళ్లు అనాథలు అవుతారు. వీళ్లు ఐదునిమిషాల సుఖం కోసం ఇంత మంది జీవితాలను బలి చేశారు. ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.