ప్రేమ.. రెండు హృదయాల మధ్య ఏర్పడే ఓ అద్భుత బంధం. కానీ, కొందరు దానిని రెండు శరీరాలకు పరిమితం చేస్తున్నారు. వారి కామవాంఛలు తీర్చుకునేందుకు ప్రేమ అనే పేరును వాడుకుంటున్నారు. అవసరాలు తీర్చుకుని.. పెళ్లి అనగానే ముఖం చాటేస్తున్నారు. అలా మోసపోయిన ఓ మహిళ ప్రియుడి ఇంటి ముందు దీక్షకు కూర్చుంది. తనకు న్యాయం చేసే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని తన కుమార్తె సహా అక్కడే బైఠాయించింది.
ఇదీ చదవండి: వీడియో: ఆ ప్రియురాలికి కోపం వచ్చింది! ఊర కొట్టుడు!
బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం మాడ్గులపల్లికి చెందిన బేబీరాణి, మిర్యాలగూడలోని ఆస్పత్రిలో పనిచేస్తుండగా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన కారింగుల శ్రీనుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 2015లో బేబీరాణి హైదరాబాద్ లోని ఆస్పత్రిలో నర్సుగా చేరింది. శ్రీను కూడా హైదరాబాద్ లోనే ఓ స్కూల్ లో పీఈటీగా పనిచేస్తుండేవాడు. అక్కడ వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్నారు.
ఆ తర్వాత వారి ప్రేమ వ్యవహారం ఊరిలో తెలిసిపోయింది. పెద్దలు పెంచాయితీ పెట్టి.. ఇద్దరినీ కలవకూడదని గట్టిగా హెచ్చరించారు. అయితే వారు మాత్రం మాట్లాడుకుంటూనే ఉన్నాడు. శ్రీను ఆమెతో ప్రేమ కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ, బేబీరాణికి ఎక్కడో అనుమానం ఉండి.. దూరంగా ఉండటం మొదలు పెట్టింది. ఆమెను నమ్మించేందుకు 2018లో గుడిలో వివాహం చేసుకున్నాడు. కులాలు వేరు కాబట్టి.. పిల్లలు పుడితే వాళ్లే ఒప్పుకుంటారులే అని నమ్మించాడు. శ్రీను మాటలు నమ్మి 2020లో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత నుంచి శ్రీను ముఖం చాటేయడమే కాదు.. ఇంకో వివాహం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: అనాథ యువతికి ఘనంగా వివాహం చేసిన గ్రామస్థులు!
తనకు న్యాయం చేయాలంటూ బేబీరాణి.. శ్రీను ఇంటి ఎదుట బంధువులతో కలిసి బైఠాయించింది. ఆసమయంలో శ్రీను, అతడి తండ్రి ఇంట్లో లేరు. తల్లేమో.. తన కుమారుడికి ఆ మహిళకు ఎలాంటి సంబంధం లేదంటూ చెబుతోంది. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. పోలీసులు కలుగజేసుకుని.. స్టేషన్ సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. బేబీరాణి ఇంటి వద్ద గొడవ చేయకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.