గతరాత్రి ఇంటి నుంచి అదృశ్యమైన 17 ఏళ్ల బాలిక అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఆ బాలిక మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సుభాశ్నగర్కు చెందిన బాలిక రాత్రి ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది.
బాలిక కోసం వెతికిన తల్లిదండ్రులు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో.. రక్తపు మడుగులో ఆ బాలిక శవం దొరికింది. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిసరాలను పరిశీలించారు. భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా? లేక మరేమైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.