ప్రేమ.. పేరుకు రెండు అక్షరాలే అయినా.. రెండు జీవితాలను ముడివేస్తుంది. ఎందరో ప్రేమించిన వారిని పెళ్లాడి ఆనందంగా జీవితం గడుపుతున్నారు. కానీ, ఆ అదృష్టం అందరికీ ఉండదు. ఆ అదృష్టానికి నోచుకోలేక పోయామని ఓ యువ ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. వేరొకరిని తన భాగస్వామిగా ఊహించుకోలేని ఆ యువతి ప్రాణం తీసుకుంది. ఆమె మరణ వార్త విన్న యువకుడు.. ఆమెలేని ఈ లోకం నాకెందుకంటూ అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం మామిడిచెట్టు తండాకు చెందిన శాంతి(21) అదే గ్రామానికి చెందిన శివ(25) ప్రేమించుకున్నారు. శివ క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం తర్వాత వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. తమకు వివాహం చేయాలంటూ వారు పెద్దలను కోరారు. అందుకు పెద్దలు అంగీకరించలేదు. ఎలాగైనా పెద్దలను ఒప్పించాలని చాలానే ప్రయత్నించారు. కానీ, అది జరిగే పని కాదు అని వారికి అర్థమైపోయింది. వేరొకరిని తన భాగస్వామిగా ఊహించుకునేందుకు శాంతి సిద్ధపడ లేదు.
ఫిబ్రవరి 3న శాంతి తల్లిదండ్రులతో కలిసి పుణేకి వెళ్లింది. అక్కడ ఏం అనుకుందో ఏమో? ఫిబ్రవరి 14న పుణేలోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ వార్త విన్న శివకు ఏమీ అర్థం కాలేదు. ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనే వార్త అతడిని దహించి వేసింది. మరణించిన ప్రేయసి జ్ఞాపకాలతో బతకాలా? వేరొకరిని పెళ్లాడి జీవితాన్ని కొనసాగించాలా? ఇలాంటి ప్రశ్నలు అతని మదిలోకి రాలేదు. నేను ప్రేమించిన శాంతి లేని ఈ జీవింత నాకెందుకు అని అనుకున్నాడు. షాద్ నగర్ నుంచి తండాకు వెళ్తూ.. సువర్ణకుటీర్ వద్ద పురుగులమందు తాగాడు.
ఇదీ చదవండి: భర్తని మోసం చేసి మామతో! మామకి తెలిసే మరో యువకుడితో! ఈమె ఆడదేనా?
అపస్మారకస్థితిలో ఉన్న శివను అటుగా వెళ్లేవారు.. ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందతూ శివ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఎదిగొచ్చిన ఒక్కగానొక్క కుమారుడుని కోల్పోయి.. నీలమ్మ, సేవ్యా దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. అటు శాంతిని కోల్పోయిన పూల్ సింగ్, చంద్రమ్మల కుటుంబం రోధనలతో తండా మొత్తం తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కొడుకు.. అల్లారుముద్దుగా పెంచుకుని.. అక్కరకు వచ్చే సమయంలో ఇలా వారిని అన్యాయం చేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.