వైవాహిక జీవితం ప్రేమ, నమ్మకం మీదే కొనసాగుతుంది. రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా.. వారి జీవితం అంధకారం అవుతుంది. అందుకు చాలా సందర్భాలు సాక్షాలుగా నిలిచాయి కూడా. అలాంటి ఓ ఘటనే వెలుగు చూసింది. కట్టుకున్న భార్యపై ఆ భర్తకు అనుమానం మొదలైంది. అది ఎంతదూరం వెళ్లిందంటే.. ఆమెను దారుణంగా హత్య చేసే దాకా వెళ్లింది. గొంతునులిమి భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత ఆ కేసు నుంచి బయటపడేందుకు.. ఆమె ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, అడ్డంగా దొరికిపోయాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా మంత్రాలయం రూరల్ మాధవరం తండా గ్రామంలో గోవిందనాయక్, విజయాబాయి(35) దంపతులు నివాసముంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇంతకాలం ఎంతో సంతోషంగా కాపురం చేసిన వారి మధ్య కొన్ని పొరపొచ్చాలు మొదలయ్యాయి. గోవిందనాయక్ తీరు మారిపోయింది. ప్రతి విషయాన్ని విజయాబాయితో గొడవలు పెట్టుకోవడం చేస్తున్నాడు. మొదట్లో ఎందుకు అలా జరుగుతోంది అర్థం కాలేదు. కానీ, కొన్నాళ్లకు తన మనసులో ఏముందో గోవిందనాయక్ బయటపెట్టాడు. ఆమె తీరుపై తనకు అనుమానం ఉందన్నాడు. వేరొకరితో తన భార్య శారీరక సంబంధం పెట్టుకుందని గట్టిగా నమ్మాడు.
15 ఏళ్లుగా కాపురం చేస్తున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతోనే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. శనివారం రాత్రి గోవిందనాయక్ నిద్రపోతున్న భార్యను గొంతునులిమి హత్య చేశాడు. క్షణికావేశంలో కావచ్చు.. ప్లాన్ చేసి కావచ్చు. హత్య అయితే చేసేశాడు. కానీ, ఆ కేసు నుంచి తప్పించుకోవాలని గట్టిగానే పథకం పన్నాడు. హత్య చేసిన తర్వాత భార్య శవాన్ని ఇంట్లో ఫ్యాను వేలాడదీశాడు. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి గోవింద నాయక్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇంట్లో పని చేసే డ్రైవర్ తో ప్రేమ! చివరికి ట్విస్ట్ ఊహించలేరు!