సమాజంలో జరుగుతున్న ఎన్నో నేరాలకు ఆస్తి, అంతస్థులే దాదాపు కారణాలు అవుతున్నాయి. అయితే తల్లిదండ్రులు తమకు నచ్చినట్లుగా పంపకాలు చేస్తే సరే.. లేదంటే వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. 60 ఏళ్ల వయసులో నాకు తోడు కావాలి.. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఓ తండ్రి. అందుకు ఆస్తి ఎక్కడ తమకు కాకుండా పోతుందో అని ఆ కొడుకు అడ్డం తిరిగాడు. ఈ వయసులో పెళ్లేంటి? నీకు అవసరమా అంటూ ఎదురుతిరిగాడు. ఎంత చెప్పినా వినడం లేదని తండ్రినే హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నాటకమాడాడు.
ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న వారానికే ఆత్మహత్యకు పాల్పడిన వధువు
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా గోనెగండ్లలో గోనెసంచిలో ఓ మృతదేహం లభ్యమైంది. ఆ కేసులో విచారణ చేయగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. మృతుడు గోపాల్(60)గా గుర్తించారు. దర్యాప్తులో గోపాల్ కు అతని పెద్ద కుమారుడికి ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేశారు. గోపాల్ భార్య 2017లో మరణించింది. ఆ తర్వాత నుంచి గోపాల్ రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. అదే విషయాన్ని కుమారులకు కూడా చెప్పాడు. కానీ, అందుకు అతని పెద్ద కుమారుడు అడ్డుచెప్పాడు. ముఖ్యంగా తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే ఆస్తి రాకుండా పోతుందని అతని భయం.
ముఖ్యంగా ఆస్తి భయంతోనే తండ్రిని రెండో పెళ్లి చేసుకోవద్దని వారించాడు. కానీ, గోపాల్ పెద్దకుమారుడు బాలరంగడి మాటలు పట్టించుకోలేదు. అప్పటి నుంచి తండ్రితో బాలరంగడు తరచూ గొడవలు పడుతూ ఉన్నాడు. ఇక్క అక్కడ ఉంటే పెద్ద కొడుకుతో కుదరదని భావించిన గోపాల్ మకాం కర్నూలుకు మార్చాడు. తనకు సంబంధాలు చూడాలంటూ దేవనకొండ మండలం సింగాపురం గ్రామానికి చెందిన ఈరన్నను సంప్రదించాడు. పెళ్లికి ఒప్పుకునే వారికి రూ.13 లక్షల విలువైన రెండు సెంట్ల స్థలం ఇస్తానని చెప్పాడు. అడ్వాన్స్ కింద రూ.2 లక్షలు ఇచ్చాడు. ఈ విషయం మొత్తం పెద్ద కుమారుడికి తెలిసింది. ఆగ్రహంతో ఊగిపోయాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
తండ్రికి పెళ్లి సంబంధం చూస్తానన్న ఈరన్నతో బాలరంగడు మాట్లాడాడు. తండ్రికి పెళ్లి సంబంధం చూడొద్దని వారించాడు. అలా చేస్తే తమ పరువు పోతుంది. ఆస్తి కూడా రాదని చెప్పాడు. తండ్రిని హత్య చేసేందుకు సహకరిస్తే రూ.1.5 లక్షలు ఇస్తానని ఈరన్నను ఆశ పెట్టాడు. డబ్బు ఆశకు లొంగిపోయిన ఈరన్న.. బాలరంగడితో చేతులు కలిపాడు. పెళ్లి సంబంధం ఉందంటూ గోపాల్ ను పిలిపించాడు. ఈ నెల 14న ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో అమ్మాయి ఉందని చెప్పాడు. నమ్మిన గోపాల్ పెళ్లిచూపులకు బయల్దేరాడు. గోపాల్ ను బైక్ పై ఈరన్న, మల్లికార్జున్ తీసుకెళ్లారు.
సిరాలదొడ్డి మార్గం మధ్యలో బైక్ ఆపారు. అప్పటికే బాలరంగడి అక్కడికి చేరుకున్నాడు. ముగ్గురు కలిసి తండ్రి మెడకు లుంగీ బిగించారు. ఆ తర్వాత బాకు తీసుకుని గోపాల్ పీక కోసేశారు. మృతదేహం దొరకకూడదని గోనెసంచిలో కట్టి కాలవలో పడేశారు. ఫిబ్రవరి 17వ తేదీన మృతదేహం లభించింది. గోపాల్ మృతిపై చిన్న కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో ఇద్దరితో కలిసి హత్య చేసినట్లు బాలరంగడు అంగీకరించాడు. మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.