కొందరు పడక సుఖం కోసం వావివరసలు, ఇంకిత జ్ఞానం వదిలేసి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దొరికే దాకే దొర అన్నట్లు నడిచినంత కాలం వారి వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. ఎవరికైనా తెలుస్తుందేమో అనే భయంతో హత్యలు కూడా చేస్తున్నారు. ఆ జాబితాలో కట్టుకున్న భర్త/భార్య/కన్నపిల్లలు ఎవరున్నా కాటికి పంపడమే. అలా ఓ మహాతల్లి తండ్రిలాంటి మామతో పక్క పంచుకుంది. భర్త లారీ, ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తుంటే.. భార్యేమో భర్త తండ్రితోనే పడక సుఖాలు తీర్చుకుంటోంది. ఓ రోజు ఇద్దరూ గదిలో కలిసుండగా కుమార్తె చూసింది. భర్తకు చెబుతుందని భయంతో మామతో కలిసి కడుపున పుట్టిన కూతుర్నే కడ తేర్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా బోనకల్ లో హరికృష్ణ- సునీత దంపతులు నివాసం ఉంటున్నారు. హరికృష్ణ కుటుంబ పోషణ కోసం లారీ, ఆటో తోలుతూ ఉంటాడు. ఎక్కువ సుదూర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటాడు. ఆ క్రమంలో కొన్నిసార్లు రోజుల తరబడి ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు. వారికి మహాదేవి(11) అని కుమార్తె ఉంది. సునీతకు తన భర్త తండ్రి నరస్సింహారావుతో వివాహేతర సంబంధం ఉంది. భర్త ఇంట్లో లేని సమయంలో స్వయాన మామతో పక్క పంచుకుంటుంది. తన కోరిక తీర్చుకునేందుకు మామ కూడా కూతురులాంటి కోడలితో పడక సుఖాన్ని అనుభవిస్తున్నాడు. భర్త కళ్లుగప్పి ఐదారేళ్లుగా మామతో సరసాలాడుతూనే ఉంది.
ఓ రోజు మామతో గదిలో ఉండగా.. కుమార్తె మహాదేవి గమనించింది. ఆ విషయం తండ్రికి చెబుతానని కోపంగా వెళ్లిపోయింది. ఆ విషయం భర్తకు తెలిస్తే ఇద్దరి పరిస్థితి ముగిసిపోతుందని భయపడ్డారు. ఎలాగైనా మహాదేవిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా చున్నీతో ఆమె కాళ్లు, చేతులు కట్టేసి వైర్ తో గొంతు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత అది సహజ మరణం అని నిరూపించేందుకు చాలా కష్టాలు పడ్డారు. పాప స్కూల్లో ఫిట్స్ వచ్చి పడిపోయిందని. ఆ సమయంలో దెబ్బ తగిలిందని పీహెచ్ సీకి తీసుకెళ్లారు. అక్కడ మహాదేవి చనిపోయినట్లు చెప్పారు. అయితే పీహెచ్ సీలో చనిపోయినట్లు నిర్ధారించకూడదని ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు.
ఇదీ చదవండి: కొడుకుతో కలిసి తల్లి దారుణం! రోజూ కలవాలని టార్చర్!
ఖమ్మం ఆస్పత్రికి మహాదేవి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్లు నిర్ధారించారు. అయితే పోస్టుమార్టం చేయకుండా ఆపేందుకు నరస్సింహారావు శతవిధాలా ప్రయత్నించాడు. చిన్నపాపను ముక్కలు చేసి తమను బాధపెట్టొద్దని ఓ డ్రామా వేశాడు. అయితే పాప మెడకు గాయాలు గమనించిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకుని పోస్టుమార్టం చేయించారు. అప్పుడు ఆమె హత్యకు గురైందని నివేదిక వచ్చింది. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు నరస్సింహరావు మరో ఎత్తుగడ వేశాడు. ఊరిలో ఓ కుర్రాడితో తన కోడలికి అక్రమ సంబంధం ఉందని.. అతనే ఈ హత్య చేసినట్లు బుకాయించాడు.
పోలీసులు ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారించారు. సునీతతో అక్రమ సంబంధం ఉన్న మాట వాస్తవమే. కానీ, మహాదేవిని తాను హత్య చేయలేదని తెలిపాడు. సునీత, నరస్సింహరావులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అసలు విషయాన్ని సునీత పోలీసుల ఎదుట అంగీకరించింది. మహాదేవిని మామతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసును వారంలోగా ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. ఇక్కడ మహాదేవి రెండు తప్పులు చేసింది. అవును.. ఒకటి సునీతకు కూతురిగా పుట్టడం. రెండు మామతో సరసాలు ఆడే సమయంలో వారిని చూడటం. తప్పు వీళ్లు చేసి శిక్ష చిన్నారికి వేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.