ఆడవారిపై కొందరు దుర్మార్గుల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ దారుణమైన ఘటన ఒకటి కరీంనగర్ లో వెలుగు చూసింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తండ్రికి సేవ చేసేందుకు ఓ యువతి వచ్చింది. ఆమె బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా ఆ ఆస్పత్రికి చెందిన సిబ్బందే ఫోన్లో వీడియో తీసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వారిని శిక్షిచాల్సింది పోయి.. ఆస్పత్రి యాజమాన్యం కూడా వెనకేసుకురావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా కొలనకూరుకు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అతనికి సహాయంగా ఉండేందుకు కుమార్తె అక్కడే ఉంటోంది. కొన్నిరోజుల చికిత్స తర్వాత అతని ఆరోగ్యం మెరుగైంది. డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో యువతి సమాన్లు సర్దుకుంది. ఆ తర్వాత స్నానం చేసేందుకు బాత్ రూమ్ కు వెళ్లింది. కాసేపటికి ఆమెను ఎవరో వీడియో తీస్తున్నారని గమనించి కేకలు వేసింది. వెంటనే ఆమ తల్లి, సోదరి అక్కడికి వెళ్లారు.
యువతి స్నానం చేసిన బాత్ రూమ్ కు అటాచ్ చేసి మరో బాత్ రూమ్ కూడా ఉంది. దానిబయట ఆస్పత్రికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. బాధితులు అక్కడ చెక్ చేసేందుకు అతను అనుమతించలేదు. బలవంతంగా లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ ఆస్పత్రి యూనిఫామ్ లో ఉన్న ఓ వ్యక్తి ఉన్నాడు. రెండు బాత్ రూమ్ ల మధ్య ఒక పెద్ద రంద్రం కూడా ఉంది. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు బాధితులనే తప్పుబట్టారు. సిబ్బందిని వెనకేసుకొచ్చారు. పోలీసులను పిలిపించి బాధితులనే బెదిరించారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఈ కేసుపై పెద్దగా స్పందించింది లేదు.
ఇదీ చదవండి: పీకల దాకా మందు తాగిన దంపతులు.. మత్తులో భర్తను భార్య..
బాధితులకు చెందిన బంధువులు ఆస్పత్రి వద్ద నిరసనకు దిగారు. విషయం మీడియాలోకి వెళ్లింది. ఆస్పత్రి బాత్ రూమ్ లకు మధ్య పెద్ద హోల్ ఉన్న విషయం, ఆ వీడియో కూడా బయటకు రావడంతో పోలీసులు మళ్లీ ఆస్పత్రికి చేరుకున్నారు. సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో పోలీసుల తీరు చాలా అనుమానం కలిగించేలా ఉందని బాధితులు ఆరోపించారు. వీడియో తీసిన వ్యక్తి మానకొండూరుకు చెందిన అరవింద్ గా గుర్తించారు. నిందితులతో పాటు యాజమాన్యంపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.