వివాహ బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. కానీ, అనుమానం, గొడవలు, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, వివాహేతర సంబంధాలు.. ఇలా కారణాలు ఏవైనా కావచ్చు పచ్చగా ఉండాల్సిన సంసారాలు నిట్టనిలువునా కూలిపోతున్నాయి.
గత కొంత కాలంగా అక్రమ సంబంధాలతో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటూ పిల్లలను అనాథలును చేస్తున్నారు. కరీంనగర్ లో ఒక దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ భర్త తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని నిద్రిస్తున్న సమయంలో రోకలిబండతో కొట్టి హత్య చేసిన తర్వాత వాగు ఒడ్డులో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గుండ్ల పల్లికి చెందిన పెనుగొండ వెంకట్ రెడ్డి, లక్ష్మీ భార్యాభర్తలు.. వీరికి ఇద్దరు కుమారులు. కొంత కాలం సంతోషంగా సాగిన వీరి దాంపత్య జీవితంలో ఈ మద్య కలతలు ఏర్పడ్డాయి. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని వెంకట్ రెడ్డి భార్యపై తరుచూ గొడవపడేవాడు. వెంటక్ రెడ్డి సీజనల్ ఫంక్షన్లకు క్యాటరింగ్ ఏర్పాటు చేసేవాడు. లక్ష్మి ఇంటి వద్ద ఉంటూ కిరాణా షాప్ తోపాటు బెల్ట్ షాపు కూడా నర్విహిస్తూ ఉండేది. ఇటీవల లక్ష్మికి బోనగిరి వెంకట స్వామితో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం అక్రమసంబంధానికి దారి తీసింది. ఈ విషయంపై భార్యాభర్తల మద్య ప్రతిరోజూ గొడవలు జరుగుతూ ఉండేవి.
తన సంతోషాలకు భర్త అడ్డు వస్తున్నాడని భావించిన లక్ష్మి అతన్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో భర్త వెంకట్ రెడ్డి నిద్రిస్తున్న సమయంలో రోకలిబండతో కొట్టి హత్యచేసింది. తన ప్రియుడి సహాయంతో కారులో మృతదేహాన్ని హుస్నాబాద్ లో ఒక వాగు వద్దకు తీసుకువెళ్లి ఎవరూ చూడకుండా పూడ్చిపెట్టారు. వెంకట్ రెడ్డి కనిపించడకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో తాము చేసిన నేరం ఎక్కడ బయట పడుతుందో అని వెంకటస్వామి, డ్రైవర్ కుమార్ లు స్టేషన్ కి వచ్చి తమ తప్పు ఒప్పుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. తమదైన శైలీలో విచారించడంతో తానే హత్య చేసినట్లు అంగీకరించింది లక్ష్మి. కేసు నమోదు చేసుకొని లక్ష్మి, ఆమె లవర్ వెంకటస్వామిని అరెస్టు చేశారు.