సెలూన్, స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం సాగుతూనే ఉంది. ఎన్ని దాడులు చేసి.. ఎన్ని సెంటర్లను మూసేసినా కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పోలీసులు మరో సెలూన్ ముసుగు వ్యభిచారం గుట్టు రట్టు చేశారు. ఇద్దరు యువతులు సహా ఓ విటుడిని కూడా అరెస్టు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటన తుకారంగేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఈస్ట్ మారేటుపల్లిలో లరీసా ఎక్స్ క్లూసివ్ స్పా అండ్ సెలూన్ సెంటర్ ఉంది. ఆ స్పా నిర్వాహకులు రంగం కిషోర్(35), అనీష్(25) సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. తుకారాంపేట్ పోలీసులు పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు. సెలూన్ యజమానులు కిషోర్, అనీష్ లతో పాటు మరో ఇద్దరు మహిళలు, ఓ విటుడు ఆంటోనీ(46)ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సెంటర్ లో నాలుగు సెల్ ఫోన్లు, రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు, విటుడిని రిమాండ్ కు తరలించారు. మహిళలను ప్రజ్వల హోంకు తరలించారు.
ఇదీ చదవండి: కన్న కూతురిని గర్భవతిని చేసిన తండ్రి!