భార్యైనా, భర్తైనా వారి శ్రద్ధ, చూపు అంతా ఇంట్లో ఉన్న వారిపై ఉన్నంత వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది. ఐదు నిమిషాల నీచమైన సుఖంకోసం పక్కచూపులు చూశారంటే.. అది ఎన్నో అనార్థాలకు దారి తీస్తుంది. అది చాలా విషయాల్లో రుజువు అయ్యింది. ఇంకా అవుతూనే ఉంది. ఎన్ని ఘటనలు చూసినా అలాంటి వారిలో మార్పు రావడం లేదు. ఇక్కడ కూడా అలా చీకటి సుఖం కోసం పక్కింటి వాడిపై మనసు పారేసుకుంది. ఆ తర్వాత శారీరకంగా అతనికి దగ్గరైంది. ఇంకేముంది.. ప్రియుడి ఒడిలో ఒదిగిపోయిన భార్యను భర్త చూశాడు. వెంటనే ఆమెను గట్టిగా మందలించాడు. ప్రియుడితో కలవద్దు అనడంతో ఆ మహిళ కోపంతో ఊగిపోయింది. ఇంకేముంది.. ప్రియుడితో కలిసి కట్టుకున్న వాడిని కాటికి పంపింది. ఏం ఎరగని అమాయకురాలిగా భర్త కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించింది. విచారణలో వెలుగు చూసిన విషయాలకు పోలీసులు కూడా బిత్తరపోయారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీకి చెందిన వెంకటప్ప చందానగర్ శివారులో జీవిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటప్ప కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నాళ్లుగా అతనికి భార్య ప్రవర్తనపై అనుమానం కలిగింది. అతని అనుమానమే నిజం అయ్యింది. ఆమెకు పక్కింటి రహ్మాన్ తో పరిచయం ఏర్పడింది. ఆ చనువు కాస్తా అక్రమ సంబంధంగా మారింది. వెంకటప్ప లేని సమయంలో ఇద్దరూ తమ కోర్కెలు తీర్చుకోవడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఓ రోజు వారు కామకలపాల్లో మునిగిపోగా.. వెంకటప్ప వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.
ఆ విషయంలో రహ్మాన్, పద్మను వెంకటప్ప గట్టిగా మందలించాడు. ఆ విషయాన్ని పద్మ మనసులో పెట్టుకుంది. భర్త ఉన్నంతకాలం తన ప్రియుడిని కలవలేనని ఫిక్స్ అయిపోయింది. వాళ్లిద్దరూ ఇబ్బంది లేకుండా కలుసుకోవాలంటే భర్త ఉండకూడదని నిర్ణయించుకుంది. భర్త వెంకటప్పను చంపేందుకు సిద్ధపడింది. ఆ విషయం ప్రియుడు రహ్మాన్ కు చెప్పింది. ఈ నెల 8న చందానగర్ అడ్డా వద్ద ఉన్న వెంకటప్పను రహ్మాన్, అతనితో సెంట్రింగ్ పని చేసే సుభాష్ బైక్ పై ఎక్కించుకెళ్లారు. కొల్లూరులో పని ఉందని తీసుకెళ్లారు. అక్కడ పని లేకపోవడంతో ఆలూరు వెళ్లి అక్కడ వెంకటప్ప, సుభాష్ మద్యం సేవించారు. అక్కడి నుంచి వెంకటప్పను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: 6 నెలలగా బాలికకు నరకం! కేసులో ఏకంగా 64 మంది..!
రాయితో మద్యం మత్తులో ఉన్న వెంకటప్ప ముఖం, తలపై దాడి చేశారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడి నుంచి సుభాష్, రహ్మాన్ పరారయ్యారు. మృతదేహం లభించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతని చేతిపై ఉన్న పచ్చబొట్టు, చందానగర్ పీఎస్ లో నమోదైన కేసు ఆధారంగా మృతుడు వెంకటప్పగా గుర్తించారు. వెంకటప్ప విషయంలో పోలీసులకు పద్మపై అనుమానం వచ్చింది. ఆమెపై నిఘా పెట్టారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్, పద్మ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేశారు. వారి అనుమానమే నిజం అయ్యింది. పద్మను విచారణ చేయగా భర్తను హత్య చేయించినట్లు అంగీకరించింది. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.