ఆయన ఒక ప్రకృతి ప్రేమికుడు.. ఇంటి ప్రాంగణాన్ని గులాబీ, బంతి వంటి మొక్కలతో నింపేశాడు. శివ భక్తుడు కావడంతో పాములకు, ఇతర జీవాలకు హాని తలపెట్టడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి కూడా సర్పాలను చేతిలోకి తీసుకునేంత చనువు కల్పించాడు. అలాంటి వ్యక్తి.. భార్య, ముగ్గురు పిల్లను దారుణంగా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరమైన సంఘటన హరియాణాలో చోటు చేసుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. హిస్సార్ జిల్లా నంగ్ తాలా గ్రామానికి చెందిన రమేశ్ వర్మ గొప్ప ప్రకృతి ప్రేమికుడు. భార్యా పిల్లలంటే అమితమైన ప్రేమ. ఇలాంటి వ్యక్తి తన భార్యను ముక్కుపచ్చాలారని ముగ్గురు పిల్లలను ఇనుపరాడ్ తో కొట్టి దారుణంగా చంపాడు. అనంతరం తాను రోడ్డుపై వేగంగా వస్తున్న లారీకి అడ్డుగా వెళ్లి.. ప్రాణాలు తీసుకున్నాడు.రోడ్డుపై పడి ఉన్న రమేశ్ వర్మ మృతదేహం వద్ద 11 పేజీల సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతుడి ఇంటికు వెళ్లిన పోలీసులు.. అక్కడి భీతావహ స్థితిని చూసి షాక్ అయ్యారు. తుచ్ఛమైన జీవితం నుంచి మోక్షం పొందేందుకే ఈ పనిచేసినట్లు రమేశ్ వర్మ సూసైడ్ నోట్ లో రాశాడు. ఇంట్లోని అందరికీ మోక్షం సిద్ధి కలగాలని భార్య సవితను, ముగ్గురు పిల్లలను దారుణంగా హత్యచేసినట్లు లేటర్ లో రాశాడు.
తన ఇంటికి ఎప్పుడూ.. తాళం వేసే ఉంచాలని, తన ఆత్మ ఇంట్లోనే ఉంటుందని, తన చితాభస్మాన్ని శ్మశానం వాటికలోని మొక్కలకు వేయాలని సూసైడ్ నోట్ లో రాశాడు. రమేశ్ వర్మ ప్రింటింగ్ ప్రెస్ నడిపేవాడని, భార్యాపిల్లలను అపురూపంగా చూసుకునేనవాడని, కానీ ఇంత దారుణానికి పాల్పడతాడని అనుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.