మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదొక మూల ఓ చిన్నారి, ఓ మహిళ దాడికి గురవుతూనేఉన్నారు. ఆ ఘటనలపై పోలీసులు ఎంతో సీరియస్ గా ఉన్నారు. తప్పు చేసింది ఎంతటి వారైనా ఉపేక్షించడం లేదు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఇటీవల గుంటూరు జిల్లాలో ఓ బాలికను మహిళ వ్యభిచార కూపంలోకి దింపిన కేసును పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులో నివసించే తల్లీకుమార్తెకు కరోనా సోకింది. వారు జీజీహెచ్ లో చికిత్స తీసుకుంటుండగా తల్లి మరణించింది. ఆస్పత్రిలో బాలికకు స్వర్ణకుమారి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. కరోనాకు నాటు వైద్యం చేయిస్తానంటూ తండ్రిని ఒప్పించి ఆ బాలికను తన వెంట తీసుకెళ్లింది. కొన్నాళ్ల తర్వాత బాలికను వ్యభిచార కూపంలోకి దింపింది. చెప్పింది వినాలంటూ వేధింపులకు గిరి చేసింది. ఆ బాలికతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యభిచారం చేయించింది. 6 నెలలపాటు బాలికను చిత్రిహింసలకు గురి చేశారు. ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది.
ఆ మురికి కూపం నుంచి బాలిక ఎలాగోల తప్పించుకుని తండ్రిని కలిసింది. తర్వాత తన తండ్రిని వెంటబెట్టుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారణలో వేగం పెంచిన పోలీసులు మొదట స్వర్ణకుమారి సహా 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా.. నిందితులు అందరినీ అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చారు. దాంతో ఆ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని పోలీసులు వెతికి పట్టుకున్నారు. మొత్తం ఆ కేసుకు సంబంధించి 64 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బయటకి ఫ్యామిలీ టైప్! లోపల మాత్రం ఆంటీలతో..!