ఈ మధ్య అక్రమ సంబంధం- వివాహేతర బంధాల ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడ చూసినా పలానా యువతితో వివాహితుడికి సంబంధం, పలానా యువకుడితో లేచిపోయిన 40 ఏళ్ల ఆంటీ.. ఈ సంఘటనలే కనిపిస్తున్నాయి. ఎన్ని చీకటి బంధాలు వెలుగులోకి వచ్చినా.. ఎన్ని ప్రాణాల్లో గాల్లో కలిసిపోతున్నా అలాంటి వారికి బుద్ధి రావడం లేదు. అలా పడక సుఖం కోసం కక్కుర్తి పడిన ఈ వ్యక్తి.. ఉంచుకున్న మహిళ భర్తను అంత మొందించాలని దారుణ పథకం రచించాడు. ఆ పథకానికి ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యం లోదొడ్డి గ్రామంలో జీలుగు కల్లు తాగి ఐదుగురు మరణించిన మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆ ఐదుగురు మరణాలు.. ప్రమాదం కాదని పక్కా ప్లాన్ తో చేసిన హత్యలుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆ ఐదు హత్యలకు అక్రమ సంబంధమే కారణంగా పోలీసులు తేల్చారు. మృతుల్లో ఒకడైన గంగరాజు భార్యతో రాంబాబుకి వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. జీలుగు కల్లులో గడ్డిమందు కలిపి రాంబాబు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడిగా రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గిరిజన గ్రామంలో జీలుగు కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని కల్లు శాంపిల్స్ ను సేకరించారు. మృతులు గంగరాజు, లోవరాజు, సన్యాసయ్య, సుగ్రీవు, ఏసుబాబుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇది కల్తీ కల్లు కాదని.. కావాలనే గడ్డి మందు కలిపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ రోజే మృతుల కుటుంబ సభ్యులు కూడా కల్లు కుండ క్రిమిసంహారక మందు వాసన వస్తున్నట్లు ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: 7 ఆర్ట్స్ సరయు కేసులో షాకింగ్ ట్విస్ట్! కాసేపట్లో..!
అక్రమ సంబంధం- చీకటి సుఖం కోసం పాకులాడిన స్త్రీ- పురుషుడి కారణంగా ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారి తెరచాటు సంసారం ఇందరి కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. అంత మందికి క్షోభను మిగిల్చింది. ఇంత జరుగుతున్నా అలాంటి వారిలో మార్పు రావడం లేదు. ఈ అరాచకాలు తగ్గు ముఖం పట్టడం లేదు. అసలు వీటిని అదుపు చేయడం ఎలా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.