సమాజంలో దారుణాలు మరీ మితిమీరిపోతున్నాయి. ఓ వ్యక్తిని తన భార్యే అత్యంత క్రూరంగా హత్య చేసింది. కట్టుకున్న వాడు అని కూడా చూడకుండా మర్మాంగాన్ని కోసేసింది. ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేసింది. ఊరంతా వచ్చి నీ భర్త చనిపోయాడంటే ‘అయ్యో నా మొగుడా’ అంటూ ఏడుపు లంకించుకుంది. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసేయాలని ఏర్పాట్లు చేసుకుంది. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అసలు కథ బయటకు వచ్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ వివారల ప్రకారం.. సీతానగరం మండలం రఘుదేవపురం యానాదుల కాలనీలో అబ్బులు(46), భార్య ముత్యాలమ్మ నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దమ్మాయికి పెళ్లైంది. అబ్బులు- ముత్యాలమ్మ తరచూ గొడవలు పడుతూ ఉంటారు. బుధవారం రాత్రి ఇద్దరూ తాగిన మైకంలో గొడవ పడ్డారు. ఇద్దరూ కోపంగా ఇంటి నుంచి వెళ్లిపోయారు. ముత్యాలమ్మ ఒక్కతే ఇంటికి తిరిగి వచ్చింది. అబ్బులు మాత్రం ఆ రాత్రి ఇంటికి రాలేదు.
తర్వాతి రోజు ఉదయం రాపాక రోడ్డులోని కల్వర్టు వద్ద అబ్బులు మృతదేహం లభించింది. గ్రామస్థులు పరుగున వెళ్లి ముత్యాలమ్మకు విషయం చెప్పారు. కంగారుగా కల్వర్టు దగ్గరకు వెళ్లి భర్త మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపిచింది. వెంటనే శవాన్ని ఇంటికి తీసుకొచ్చి హుటాహుటిన అంత్యక్రియలకు ఏర్పాటు చేయసాగింది. గుర్తుతెలియని వ్యక్తి పోలీసు కంట్రోలు రూమ్ కు ఫోన్ చేశారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తన భర్త అనారోగ్యంతో మరణించాడంటూ ముత్యాలమ్మ నమ్మించే ప్రయత్నం చేసింది. మృతదేహాన్ని పరిశీలించగా అతని మర్మాగం కట్ చేసుంది. ముఖం మీద కూడా కొట్టిన ఆనవాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: పొలిటికల్ లీడర్స్ కు ఇంట్లో పార్టీలు! ఏంకావాలంటే అది ఇస్తానని!
పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటకు వచ్చింది. తాగి ఇద్దరూ బయటకు వెళ్లాక కల్వర్టు దగ్గర అబ్బులుపై ముత్యాలమ్మ దాడి చేసింది. అక్కడున్న టాయిలెట్ సింక్ తో ముఖంపై బలంగా కొట్టింది. ఆ తర్వాత అతని మర్మాంగాన్ని కోసేసింది. అబ్బులు శవాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దాంపత్య జీవితంలో అరమరికలు, గొడవలు సహజం. భర్త హింసిస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇలా హత్యచేస్తే ఏమొస్తుంది? పెళ్లికావాల్సిన రెండో కూతురు పరిస్థితి ఏంటి? తండ్రిపోయి.. ఉన్న తల్లి జైలుకుపోతే ఆమెకు దిక్కెవరు? క్షణికావేశంలో చేసే ఇలాంటి తప్పులు వారి జీవితాలనే కాదు వారిని నమ్ముకున్న వారి జీవితాలను కూడా చీకటిమయం చేస్తాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.