దేశంలో ఆడవాళ్లపై దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉయ్యాల్లోని పసికందు, ఇంటి ముందు ఆడుకునే చిన్నారి, మంచంలోని ముసలమ్మ ఇలా వయసుతో సంబంధం లేకుండా బలవుతూనే ఉన్నారు. తాజాగా మంచం పట్టిన 87 ఏళ్ల వృద్ధురాలిపై ఓ దుర్మార్గుడు తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో దూరి కేకలేసిన ముసలమ్మను హత్య చేశాడు. అనంతరం ఆమెపై అత్యారానికి పాల్పడ్డాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఢిల్లీ తిలక్ నగర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ 67 ఏళ్ల మహిళ తన 87 ఏళ్ల మంచంపట్టిన తల్లితో జీవిస్తోంది. బాధితుల వివరాల ప్రకారం. దుండగుడు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వారి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో మహిళ ఇంట్లో లేదు. ఇంట్లోకి వచ్చిన వ్యక్తిని వృద్ధురాలు ప్రశ్నించగా.. ఏదో గ్యాస్ ఏజెన్సీకి చెందిన వ్యక్తిగా చెప్పినట్లు తెలుస్తోంది. అతని చర్యలపై అనుమానం వచ్చిన వృద్ధురాలు సహాయం కోసం కేకలు వేసింది. అతను డోర్ లాక్ చేసి ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు చెబుతున్నారు. అనంతరం వృద్ధురాలి ఫోన్ తీసుకుని పరారయ్యాడు.
ఆ ఘటన జరిగిన గంట తర్వాత మహిళ ఇంటికి వచ్చి చూసి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ సరిగ్గా లేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. వృద్ధురాలి మనవరాలు కెనడాలో ఉంటుంది. విషయం తెలిసినా వెంటనే వచ్చే పరిస్థితిలో లేదని బంధువులు అంటున్నారు. ఈ ఘటన తర్వాత తమ వృద్ధురాలి కుమార్తెకు కూడా రక్షణ లేదని భావన కలుగుతోందని బంధువులు వాపోతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తేసుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. బాధితుల ఆరోపణలను పోలీసులు ఖండించారు.
ఇదీ చదవండి: పిన్నితో ఎఫైర్ పెట్టుకున్నాడు..! ఆ రాత్రి పిన్ని కూడా..!
మొదట ఆ మహిళ తన కంప్లైంట్ లో దొంగతనం జరిగినట్లు మాత్రమే ప్రస్తావించినట్లు అడిషినల్ డీసీపీ ప్రశాంత్ గౌతమ్ తెలిపారు. ఫిర్యాదుదారు ప్రస్తుతం చెబుతున్న విషయాలకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ లో సెక్షన్లు జత చేసినట్లు తెలిపారు. అసలు నిందితుడు దొరికితే గానీ.. అసలు జరిగింది ఏంటనేది బయటకు రాదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.