నేటి కాలంలో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా వివాహేతర సంబంధాలకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఈ అక్రమ సంబంధాల వల్ల జరిగే దారుణాలను చూసి కూడా కొందరు వాటి వైపే ఆకర్షితులవుతున్నారు. వక్రమార్గంలో వారి పచ్చటి సంసారాలను రోడ్డున పడేయడమే కాకుండా నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఇలా పక్కింటి కుర్రాడితో పడక సుఖం కోసం తాళి కట్టిన భర్తనే దారుణంగా హత్య చేసి చివరికి జైలు పాలైయింది ఓ కామపిశాచి. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన కలిశెట్టి వెంకటరమణకు, రామభద్రపురం మండలం కొండపాలవలసకు చెందిన 27 ఏళ్ల లలిత కుమారితో 2015లో వివాహమైంది. వీరికి ఐదేళ్ల బాబు, ఏడాదిన్నర పాప ఉన్నారు. భర్త, పిల్లలతో హాయిగా గడుపుతున్న లలిత కుమారి బుద్ధి పెడదోవ పట్టింది. ఆమెకు అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల నరసింగరావు అలియాస్ బాలు అనే కుర్రాడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లుగా వారి మధ్య నడుస్తున్న అక్రమ సంబంధం గురించి లలిత కుమారి భర్తకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గతకొన్ని రోజులుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. కొన్ని నెలల కిందట భార్యను ఆమె పుట్టింటికి పంపించాడు. ఆమెలో మార్పు వచ్చి ఉంటుందేమోనని భావించి.. మళ్లీ భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.
తాజాగా అదే ఊరిలో ఉండే వెంకట రమణ.. అన్న అప్పలనాయుడు ఇంటికి అర్ధరాత్రి సమయంలో ఏడ్చుకుంటూ వెళ్లింది లలిత. తన భర్తకు గుండెనొప్పి వచ్చిందని..రెండు మాత్రలు వేసుకొని పడుకున్నాడని.. ఎంత లేపినా లేవడం లేదని ఏడుస్తూ చెప్పింది. దీంతో హడావుడిగా వెళ్లి చూడాగా సోదరుడు మృతిచెంది ఉన్నాడు. వెంకట రమణ శరీరంపై గాయాలు ఉన్నట్లు అప్పలనాయుడు గుర్తించాడు. వెంటనే తన బంధువులకు సమాచారం ఇచ్చాడు. భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్న కారణంగా తన మరదలే చంపేసి ఉంటుందని అనుమానించాడు. వెంటనే సోదరుడి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనుమానంతో ప్రియుడు బాలుని, ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఈ విచారణలో తన భర్తను ఎలా చంపిందో తెలిపింది. దీంతో పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టు చేశారు. చూశారా.. పరాయి వాడి పడక మైకంలో పడి జీవితాంతం తోడు నీడగా ఉండే భర్తను కడతేర్చింది. పిల్లలను అనాథలను చేసింది. సమాజంలో వారికి ఓ అపకీర్తిని మిగిల్చింది ఆ మహాతల్లి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.