సామాజిక మాధ్యమాల వినియోగం ఎక్కువ ఉన్న ఈ కాలంలో అర్థం చేసుకునే మనుషుల కంటే అపార్థం చేసుకునే వారే ఎక్కువయ్యారు. దీని కారణంగా సోషల్ మీడియాలో మనం పెట్టే మెసేజ్స్ కి, ఇతర పోస్టులకు అర్థం చేసుకునే వారి కంటే అపార్థం చేసుకునే వారు ఎక్కువ ఉంటున్నారు. ఇలా ఓ యువతి పెట్టిన వాట్సప్ మెసేజ్ ని అపార్థం చేసుకోవడం వలన ఓ నిండు ప్రాణం పోయింది. సదరు యువతి స్నేహితులు.. ఆమె తల్లిని దారుణంగా కొట్టి చంపారు. ఈఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
ఇది కూడా చదవండి: అనుమానంతో ఫోన్ చెక్ చేసిన తల్లిదండ్రులు! కోరిక తీర్చాలంటూ..!
మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతలోని శివాజి నగర్ లీలావతిప్రసాద్ అనే మహిళ తన 20 ఏళ్ల కూతురి తో కలిసి ఉంటుంది. ఆ యువతి అందరి లాగానే స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ నిత్యం ఏవో ఒక్కటి వాట్సప్ స్టేటస్ లు పెడుతుండేది. ఈ క్రమంలో ఆమె పెట్టిన ఓ వాట్సప్ మెసేజ్ ఆమె స్నేహితురాలు అపార్థం చేసుకుంది. దీంతో సదరు యువతి పై కోపం పెంచుకున్న ఆమె స్నేహితురాలు, తన కుటుంబ సభ్యులతో కలసి శివాజినగర్ లో ఉంటే ఆ యువతి ఇంటికి వెళ్లారు.
ఆ సమయంలో ఇంట్లో ఆ యువతి లేకపోవడంతో ఆమె తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తను ఎవరిని ఉద్దేశించి వాట్సప్ స్టేటస్ పెట్టలేదని, ఎప్పుడు పెట్టినట్లే సాధారణంగానే పెట్టానని మృతురాలి కూతురు పోలీసులకు తెలిపింది. అయితే ఆ యువతి పెట్టిన వాట్సప్ స్టేటస్ ఏంటి అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితులను అరెస్టు చేసి.. స్థానిక మేజిస్ట్రేట్ ముందు హజరుపరచగా వారం పాటు కస్టడీ విధించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.