నేటికాలంలో ఎవరిని నమ్మాల్లో ఎవరి నమ్మకూడదో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఏ వ్యక్తిలో మృగం దాగిందో కనుక్కొవడం చాలా కష్టంగా మారింది. ఇక దారుణం ఏమిటంటే.. పుణ్యానికి పోతే పాపం కాదు కదా.. ప్రాణాలే పోతున్నాయి. అలాంటి దారుణంమైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. బైక్ వెళ్తున్న వ్యక్తిని ఆపి లిఫ్ట్ అడిగాడు దుండగుడు. పోయే దారిలోనే కదా.. సాటి మనిషికి సాయం చేస్తే మంచిదే కదా? అని ఆ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు. అయితే కొంత దూరం వెళ్లాక లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్(40) భార్యతో కలసి జీవిస్తున్నాడు. వారి చిన్న కుమార్తెను ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన వ్యక్తి కి ఇచ్చి..వివాహం చేశారు. అయితే ప్రస్తుతం వల్లబిలో ఉంటున్న ఓ కుమార్తె వద్ద జమాల్ భార్య ఉంటుంది. ఆమె తీసుకొచ్చేందుకు ద్విచక్రవాహనం పై బొప్పారం నుంచి బయలుదేరాడు. ఇంక కొంత సమయంలో వల్లబి చేరుకుంటారు అనగా ఓ గుర్తు తెలియని వ్యక్తి జమాల్ బండిని ఆపి.. లిఫ్ట్ అడిగాడు. దీంతో జమాల్ తన బైక్ పై అతడ్ని ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లాగానే వెనక కూర్చున్న దుండగుడు ఇంజెక్షన్ ఇచ్చినట్లు జమాల్ గుర్తించాడు. వెంటనే ఆయన తన వాహనం ఆపగానే నిందితుడు అక్కడి నుంచి పారిపోయారు. అయితే జరిగిన విషయాన్ని భార్యకు ఫోన్ చేసి తెలిపాడు జమాల్.
కొద్ది సేపటికే ఆయన స్పృహ కోల్పోయి.. రోడ్డుపై పడిపోయారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి 108 సమాచారాం అందిచారు. అక్కడి చేరుకున్న 108 సిబ్బంది జమాల్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే జమాల్ మరణించాడు. ఘటనాస్థలంలో ఇంజెక్షన్, సిరంజీ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలీంచారు. మృతదేహాన్ని ముదిగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.