చాలా మంది దేవుళ్లకు పూజలు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం పూజల విషయంలో అతిగా ప్రవర్తిస్తుంటారు. వారు పూజలు చేస్తున్నపుడు ఎవరైనా ఆటకం కలిగిస్తే సైకోలుగా మారిపోతారు. తమ పూజలు ఆటకం కలిగిన సందర్భంలో తాము చావడానికైనా, ఎదుటి వారిని చంపడానికైనా సరే వెనుకాడరు. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. తాజాగా ఓ వ్యక్తి.. పూజ చేస్తుంటే డిస్ట్రబ్ చేశారనే ఆగ్రహంతో తన భార్య, ముగ్గురు కూతుర్లు, తల్లిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు 28 కి.మీ. దూరంలోని రాణీపోఖ్రి అనే గ్రామంలో మహేష్ కుమార్ అనే 47 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతడి భార్య నీతుదేవి(37), అపర్ణ(9), స్వర్ణ(11), అన్నపూర్ణ(13) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరితో పాటు మహేష్ తల్లి బీతన్ దేవి(75) కూడా అక్కడే ఉంటుంది. వీళ్ల పెద్ద కూతురు కృష్ణ(15) రుషికేషిలో ఉండే అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటుంది. మహేష్ కుమార్ దేవుళ్ల పూజలు ఎక్కువ చేస్తుంటాడు. ఏ పనిచేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటుండేవాడు. ఇంట్లో పూజలు చేస్తూ సమయం గడిపేస్తుండేవాడు. స్పెయిన్ లో ఉన్న మహేష్ సోదరుడు ఉమేష్ వారికి ఖర్చులకు డబ్బులు పంపేవాడు. వాటితోనే మహేష్ కుటుంబం జీవించేది.
ఈ క్రమంలో సోమవారం ఉదయం మహేష్ ఇంట్లో పూజలు చేస్తున్నాడు. ఇదే సమయంలో అతని భార్య నీతూ.. వంట చేస్తుండగా గ్యాస్ అయిపోంది. దీంతో సిలిండర్ మార్చాలని మహేష్ ని కోరింది. ఆమె అలా అడగటమే తప్పు అయ్యింది. పూజలో ఉన్న అతనికి కోపం కట్టలు తెంచుకుంది. భార్య తన పూజకు ఆటకం కలిగించిందని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. వంట గదికి వెళ్లి.. అక్కడ ఉన్న కూరగాయలు కోసే కత్తితో నీతూ గొంతు కోశాడు. ఆ తరువాత అడ్డొచ్చిన ముగ్గురు కూతుళ్లు, తల్లి ని కూడా గొంతులు కోసి చంపేశాడు. పొరుగింట్లో నివాసం ఉంటున్న సుబోధ్ జైస్వాల్ అనే వ్యక్తి.. వీరి అరుపులు విని అక్కడి వెళ్లాడు.
కిటికీలో నుంచి చూడగా.. ఇంట్లో వారందరినీ మహేష్ కుమార్ కత్తితో పొడిచి చంపేశాడు. ఈ విషయాన్ని అతను పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇంట్లోని వారందరూ దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో నిందితుడైన మహేష్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.