ఇటీవల కాలంలో ఎక్కడో ఒకచోట పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తమ బిడ్డా వేరే వారిని పెళ్లి చేసుకుంటే సమాజంలో తమ పరువు పోతుందని కొందరు మూర్ఖంపు ఆలోచనతో ఉంటారు. అలాంటి వారు పరువు కోసం ప్రాణాలు తీయడం లేదా తీసుకోవడానికి సిద్ధ పడుతుంటారు. ఇటీవల తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన యువతి మృతి విషయంలో తాజాగా సంచనల విషయాలు బయటకి వచ్చాయి. చంద్రగిరి మండలం రెడ్డి వారిపల్లి గ్రామాకి చెందిన మోహన కృష్ణ(19) అనే యువతి ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. అందరూ అనుకున్నట్లు ఆమెది ఆత్మహత్య కాదని తేలింది. తాజాగా వెల్లడైన పోస్టుమార్టం రిపోర్టులో ఆమెది ఆత్మహత్య కాదు, హత్య అని బయటపడింది. ఆ యువతిని ఎవరో గొంతు నులిమి హత్య చేసినట్లు నివేదిగా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో చంద్రగిరి పోలీసులు ఈ ఆత్మహత్యను, హత్య కేసుగా నమోదు చేశారు. ఇక అసలు ఈ ఘటన పూర్వ వివరాల్లోకి వెళ్తే…
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లికి చెందిన మునిరాజకి మోహన కృష్ణ అనే కుమార్తె ఉంది. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. దీంతో మోహన ను తన మేనమామ బాలకృష్ణ చూసుకుంటున్నారు. ఆ యువతి ఇంట్లోనే ఉంటూ ఓపెన్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో ఆంజనేయపురంకి చెందిన వికాస్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. వారిద్దరు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఇదే విషయంపై పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ కూడా జరిగింది. ఈక్రమంలో మోహన కృష్ణ, వికాస్ లు ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు.
అదే తమ కూతురు వేరే కులం అబ్బాయితో ప్రేమలో పడటం మోహన కృష్ణ తండ్రి జీర్ణించుకోలేక పోయాడు. ఈ క్రమంలో జులై 7న ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తాము ప్రేమకు అంగీకరం తెలపకపోవడంతో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మోహన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే తాజాగా వెల్లడైన పోస్ట్ మార్టం నివేదికలో యువతిది హత్య అని తేలింది. పోలీసులు ఆ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. పరువు కోసం తండ్రే..కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.