అక్రమ సంబంధాల కారణంగా పచ్చటి కాపురాలు భగ్గున కాలిపోతున్నాయి. ఒకరి తప్పు కారణంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఇద్దరి జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. తాజాగా, ఓ మహిళ నిండు జీవితం అర్థాంతరంగా ముగిసింది. అత్తవారింట్లో శవమై తేలింది. ఆ మహిళ చావుకు భర్త కుటుంబసభ్యులే కారణమని ఆమె కుటుంబసభ్యులు అంటుంటే.. ఆమెకు ఓ ఎఫైర్ ఉందని అతడే చంపేశాడని భర్త కుటుంసభ్యులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సునీతకు కర్ణాటకలోని బళ్లారి, హంద్రాళ కాలనీకి చెందిన సురేష్తో ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది.
పండగలు, శుభాకార్యాలు ఇతరత్రా పనుల కోసం తరచూ పుట్టింటికి వచ్చేది సునీత. సురేష్ కూడా వీలు చిక్కినప్పుడల్లా ఆమెతో పాటు అత్తారింటికి వెళ్లేవాడు. అయితే, గత కొన్ని రోజుల నుంచి సునీత ప్రవర్తనలో మార్పు రావటం సురేష్ గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. గొంతుకు ఉరి బిగించుకుని సునీత చనిపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమ కూతుర్ని అల్లుడే హత్య చేశాడని ఆరోపిస్తూ సునీత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అయితే, సునీత ఆదోనిలో వయసులో ఆమెకంటే చిన్నవాడైన మూర్తితో అనే కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
అతడి ఇళ్లు ఆమె ఇంటి దగ్గరే ఉంటుందని చెప్పారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం కొనసాగిందని తెలిపారు. తనను ఎక్కడికైనా తీసుకెళ్లిపొమ్మని సునీత, మూర్తిని బలవంతం చేసిందని, ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా అయ్యానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూర్తి, సునీతను హత్య చేసి ఉండొచ్చని అంటున్నారు. ఇది ఇలా ఉండగా.. సునీత ప్రియుడు మూర్తి కనిపించకుండాపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు మూర్తి కోసం అన్వేషణ ప్రారంభించారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.