ఇటీవల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా తీవ్ర పంటనష్టం వాటిల్లింది. అంతేకాదు కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. ఆదివారం కర్ణాటక రాజధాని బెంగుళూరు లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆస్తినష్టమే కాదు.. ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి.
కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలో కురిసిన వర్షాలకు ఆస్తి నష్టమే కాదు.. ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి. చిన్న చినుకుకే చివురుటాకులా వణికిపోతున్న బెంగుళూరులో ఈ మద్య కుండపోత వర్షం ప్రళయాన్ని సృష్టించింది. భారీ వర్షాల కారణంగా లోటత్తు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నాలాలు, అండర్ పాస్, మ్యాన్ హూల్స్ వరద నీటితో నిండిపోయి మనుషులనే మింగేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఏపీకి చెందిన టెక్కీ భాను రేఖ మృతి మరువక ముందే మరో యువకుడు చనిపోయిన ఘటన బెంగుళూరు లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..
బెంగుళూర్ లోని ఇన్ ఫోసీస్ సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని భానురేఖ సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి వచ్చిన బంధువులతో విహారయాత్రకు బయలుదేరింది. ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా బెంగుళూరు నగరంలో రహదారులన్నీ జలమయం అయ్యాయి. బెంగుళూర్ కేఆర్ సర్కిల్ వద్ద అండర్ పాస్ లో పెద్ద ఎత్తున వర్షం నీరు వచ్చి చేరింది.. నీటి లోతు అంచనా వేయలేక డ్రైవర్ ముందుకు పోనివ్వడంతో కారులో పూర్తిగా నీరు చేరింది. లోపల ఉన్నవారంతా ఉక్కిరి బిక్కిరి అయ్యారు.. తర్వాత స్థానికుల సహాయంతో కారులో ఉన్నవారిని బయటకు తీశారు.. అప్పటికే ఊపిరి పీల్చుకోలని స్థితిలో ఉన్న భానురేఖ(23) అనే యువతి ఆస్పత్రికి తరలించే లోపు కన్నుమూసింది. ఈ ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ఓపెన్ నాలాలో వ్యక్తి జారిపడి చనిపోయాడు.
బెంగుళూరులో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ఓ వ్యక్తి నాలాలో పడిపోయి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అలా ఐదు కిలోమీటర్ల దూరం మృతదేహం కొట్టుకుపోగా.. చివరికి ఆ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు లోకేష్ (32) గా గుర్తించారు. ఆదివారం కంపపుర ప్రాంతంలో నాలాలో లోకేష్ జారిపోయినట్లు తెలుస్తుంది. అప్పటికే నాలాలో ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. అలా ప్రవాహానికి ఐదు కిలోమీటర్ల దూరం కొటుటకుపోయిన లోకేష్ మైసూర్ రోడ్ లోని బైఠరాయణపుర వద్ద మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కెంపపుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు కాగా, దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Karnataka: A 32-year-old man in Bengaluru, identified as Lokesh, died after drowning in a stormwater drain after allegedly slipping and falling in it. His body was found 5km away from the spot. A case of unnatural death registered at Kempapura Agrahara Police Station. pic.twitter.com/glphoAAU0m
— ANI (@ANI) May 23, 2023