పోలీసులు దొంగను పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో పట్టుబడిన దొంగ పేరు సలీం అని తేలింది. అతడు శారదానగర్ లో నివాసముంటున్నట్లు తెలిసింది.
సాధారణంగా ఇళ్లలో దొంగలు పడితే చేతికందిన వస్తువులు ఎత్తుకెళ్తారు. ఇంకా డబ్బులు, నగలు, విలువైన వస్తువులు దొంగిలిస్తారు. కానీ, ఓ ఇద్దరు దొంగలు మాత్రం ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని సృష్టించారు. దొంగతనానికి వెళ్లిన ఇంట్లో మందు కోసం కక్కుర్తి పడ్డారు. తర్వాత అడ్డంగా దొరికిపోయారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. లక్నోలోని కంటోన్మెంట్ ప్రాంతంలో నిర్మల కటారి అనే ప్రాంతం ఉంది. ఆర్మీ నుండి రిటైర్ అయిన తర్వాత శర్వానంద్ తన కుటుంబంతో కలిసి ఇక్కడ నివాసముంటున్నారు.
కొద్దిరోజుల క్రితం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ఓ పెళ్లికి వెళ్లారు. అదే సమయంలో ఇద్దరు దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఇల్లు అంతా చిందరవందర చేసి కొన్ని విలువైన వస్తువులను కాజేశారు. తర్వాత నాలుగు ఖరీదైన మద్యం బాటిళ్లను చూసి వాటికి టెమ్ట్ అయ్యారు. కాస్ట్లీ మందు కనిపించగానే తాగడం మొదలుపెట్టారు. ఇద్దరిలో ఒకతను అతిగా సేవించి మంచంపై మత్తుగా ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. కొంతసేపటికి శర్వానంద్ తన కుటుంబంతో ఇంటికి చేరేసరికి బెడ్ పై గుర్తు తెలియని వ్యక్తి నిద్రపోతున్నాడు. వారిని చూసి మరో వ్యక్తి పారిపోయాడు. ఇదంతా చూసి శర్వానంద్ కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంతసేపటికి నిద్రలేచిన దొంగ తన చుట్టూ ఉన్న వారిని చూసి బిత్తరపోయాడు.
పోలీసులు దొంగను పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో పట్టుబడిన దొంగ పేరు సలీం అని తేలింది. అతడు శారదానగర్ లో నివాసముంటున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 10 తులాల బంగారం, 1.5 లక్షల విలువైన 2 కిలోల వెండి, సుమారు 50 వేల విలువైన చీరలు, 6 లక్షల నగదు మరియు కొన్ని ముఖ్యమైన పత్రాలు మిస్ అయ్యాయి. పరారీలో ఉన్న దొంగ దగ్గర ఈ వస్తువులు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.