అది హైదరాబాద్ ఎర్రగడ్డలోని మెట్ర్ స్టేషన్ ప్రాంతం. ఉదయం పూట ఉద్యోగులు అంతా ఆఫీసుకి వెళ్లేందుకు మెట్రో స్టేషన్ లోకి పరుగులు పెడుతున్నారు. ఇక అందరితో పాటుగానే ఓ 70 ఏళ్ల వృద్దురాలు మెట్రో స్టేషన్ లోకి వెళ్లింది. అయితే కొందరు టికెట్ కౌంటర్ వైపు వెళ్తుండగా, మరొకొందరు మెట్రో ఎక్కేందుకు ప్లాట్ ఫామ్ పైకి వెళ్తున్నారు. ఈ సమయంలోనే ఆ వృద్దురాలు అందరూ చూస్తుండగానే మెట్రో పై నుంచి సడెన్ గా కిందకు దూకింది. ఈ సీన్ ను చూసి అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం కింద ఉన్న వ్యక్తులు ఆ వృద్దురాలి వద్దకు వెళ్లి చూడగా ఆ మహిళ తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో పడి ఉంది.
దీంతో వాహనదారులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో ఆ మహిళ అప్పటికే చనిపోయిందని తెలుసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆమె పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా.. ఆమె పేరు మారేమ్మ (70) మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ వాసిగా పోలీసులు గుర్తించారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆ మహిళ మెట్రో స్టైషన్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో మెట్రో స్టేషన్ నుంచి దూకి చనిపోయిన ఈ వృద్దురాలు నిర్ణయంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.